జబర్ధస్త్ కామడీ షో తో తెగ పాపులర్ అయిన అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా గురించి సెలబ్రెటీలు తమదైన స్టైల్లో సూచనలు, సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే.  నిన్న దేశ వ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా సామాన్యులు, సెలబ్రెటీలు ఇంటి వద్దనే గడిపారు. ఇక యాంకర్ అనసూయ నిన్నంతా సోషల్ మాద్యంతో బిజీగా గడిపినట్లు తెలుస్తుంది.  తన సామాజిక మాధ్యమాల్లో పలు రకాలుగా నెగిటివ్ కామెంట్లు చేస్తోన్న వారిని బ్లాక్‌ చేస్తున్నానని యాంకర్ అనసూయ తెలిసింది. 'నిన్నటి నుంచి ట్విట్టర్‌, ఇన్‌స్టాల్లో కొందరి ఖాతాలు బ్లాక్‌ చేసీ చేసీ వేళ్లు నొప్పి పెడుతున్నాయంటే నమ్మండి.. ఒక్కటా రెండా.. వామ్మో వందల సంఖ్యల్లో కొంత మందిని బ్లాక్ చేయాల్సి వస్తుంది.. కానీ ఏం చేస్తాం.. అది నా బాధ్యతగా మారిపోయింది.  

 

అయినా సోషల్ మాద్యమాల్లో ఈ మద్య ఇలాంటి వారితో ఎంతో మంది తలనొప్పులు తెచ్చుకుంటున్నా మిగిలిన కాస్త మంచి వారికోసం ఇలాంటి బాధలు తప్పడం లేదని అంటుంది.  తప్పదు కదా? నా పేజ్‌లో వాళ్ల బుర్రలేనితనం ఏంటీ?  అది ఎటొచ్చీ నా బాధ్యత అంటుంది. ఇక నన్ను అర్థం చేసుకోని వాళ్లని నేను అర్థం చేసుకోని వారికి సాయం చేస్తున్నాను.. ఎలాగంటే వారిని దూరంగా ఉంచుతున్నాను' ఏం చేస్తాం అంటుంది యాంకర్ అనసూయ. 

 

'అయ్య బాబోయ్!! ఏంటీ ఇంతమందా? ఇంత మంది బుర్రలేని వాళ్లా? ఇంత మంది వితండవాదులా? ఏం చేస్తాం లేండీ' అని అనసూయ పేర్కొంది. కాగా, నేను చేసిన ఒక ట్వీట్ కొంత మంది తప్పుగా అర్థం చేసుకొని రక రకాలుగా తనను ట్రోల్ చేస్తున్నారు.. కామెంట్స్ చేస్తున్నారని వాపోయింది యాంకర్ అనసూయ. 

మరింత సమాచారం తెలుసుకోండి: