టాలీవుడ్ లేటెస్ట్ క్రష్ కృతి శెట్టి కి ఆఫర్లు ఉప్పెనలా వస్తున్నాయి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఉప్పెన ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది కృతి.. అయితే ఇంకా ఈ సినిమా విడుదలకాక ముందే కృతి కి అప్పుడే రెండు ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగా యంగ్ హీరో నిఖిల్ నటించనున్న18 పేజెస్ లో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. ఈచిత్రానికి టాప్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తుండగా  కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించనున్నాడు. 
 
ఇక కృతి కి తాజాగా మరో ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల హిట్ తో కెరీర్ లో మొదటి హిట్ కొట్టిన యాంగ్రీ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించనున్న పాగల్ లో హీరోయిన్ గా కృతి ని తీసుకున్నారట. నూతన దర్శకుడు నరేష్  డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం ఇటీవలే లాంచ్ కూడా అయ్యింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ నిర్మించనున్నాడు. 
 
ఇదిలావుంటే ఇక ఉప్పెన విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలకావాల్సి ఉండగా కరోనా ప్రభావం తో  విడుదల వాయిదాపడింది. దాంతో ఏప్రిల్ చివర్లో ఈ సినిమా ను థియేటర్లలోకి తీసుకరావడానికి  సన్నాహాలు చేస్తున్నారు. కృతి గ్లామర్ కు తోడు ఇటీవల విడుదలైన సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. బుచ్చి బాబు సాన డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో  విజయ్ సేతుపతి  విలన్ రోల్ లో నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: