తెలుగు ఇండస్ట్రీలో శ్రీమంతుడు చిత్రం నుంచి వరుస విజయాలు అందుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన నటించింది. పదమూడేళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటించింది.  ఈ చిత్రం తర్వాత మహేష్ ఏ డైరెక్టతో నటించబోతున్నాడన్న విషయం పై తెగ చర్చలు నడిచాయి.  వాస్తవానికి మహర్షితో మంచి విజయం అందుకున్న తర్వాత వంశి పైడిపల్లితో ఓ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇది పోస్ట్ పోన్ అయ్యిందని అంటున్నారు. 

 


వంశి పైడిపల్లి స్క్రిప్ట్ విషయంలో మహేష్ బాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.  ఈ విషయంపై నే వంశి డైరెక్టర్ కొద్ది టైమ్ తీసుకోబోతున్నారట. మరి తర్వాత ఏ డైరెక్టర్ అన్న సమయంలో త్రివిక్రమ్, శ్రీను వైట్ల లైన్లోకి వచ్చారు.  వీరితో పాటు గీతాగోవిందం లాంటి సూపర్ హిట్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న పరుశరామ్ తో ఓ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహేశ్ బాబుతో పరశురామ్ చిత్రం ఉంటుందా? లేదా? అనేది సందేహంగా మారింది. అయితే ఇప్పుడు ఆ సందేహానికి తెరపడిపోయింది. 

 


కొన్ని రోజులుగా తర్జన భర్జన జరుగుతన్న నేపథ్యంలో మహష్ బాబు - పరుశరామ్ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అంతా లైన్ క్లీయర్ అయి  ప్రాజెక్టును సెట్ చేసుకున్నారు. మైత్రీ, 14 రీల్స్ వారు సంయుక్తంగా ఈ  చిత్రాన్ని నిర్మించనున్నారు. జూలై నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరి గీతాగోవిందం చిత్రంలో అప్ కమింగ్ హీరో విజయ్ దేవరకొండతో సూపర్ హిట్ అందుకున్నాడు... మరి స్టార్ హోదాలో ఉన్న మహేష్ బాబు కి ఏ రేంజ్ లో విజయం ఉండబోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: