ఇండస్ట్రీ ఎక్కువ ఈక్వేషన్స్ పై రన్ అవుతుంది. మార్కెట్ లెక్కల ప్రకారమే సినిమాలు సెట్స్ కు వెళ్తుంటాయి. అయితే నితిన్ మాత్రం ఈ ఈక్వేషన్స్ కంటే ఎమోషన్స్ కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మళ్లీ నిర్మాతగా మారుతున్నాడు నితిన్. 

 

భీష్మ హిట్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు నితిన్. ఆర్గానిక్ ఫార్మింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో నితిన్ లుక్, పెర్ఫామెన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జయం నాటి నితిన్ కనిపించాడనే ప్రశంసలు వచ్చాయి. ఈ జోష్ లో మళ్లీ నిర్మాతగా మారుతున్నాడు నితిన్. అక్కినేని అఖిల్ తో సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. 

 

అఖిల్ సినిమాతో నిర్మాతగా మారాడు నితిన్. హీరోగా బిజీగా ఉన్నా.. అక్కినేని వారసుడిని లాంచ్ చేసేందుకు ప్రొడ్యూసర్ ఛైర్ లోకి వెళ్లాడు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్-ది పవర్ ఆఫ్ జువా సినిమా తీశాడు. అక్కినేని ఫాలోయింగ్ కు తగ్గట్టుగానే సిసింద్రీ ఫస్ట్ మూవీని చాలా రిచ్ గా నిర్మించాడు. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. నిర్మాత నితిన్ ను, హీరో అఖిల్ ని ఇద్దరినీ తీవ్రంగా నిరాశపరిచింది.

 

అఖిల్ సినిమా పోయిన తర్వాత నితిన్ ఓ మాట చెప్పాడు. అఖిల్ కు సూపర్ హిట్ ఇవ్వలేకపోయానని చాలా బాధగా ఉంది. మళ్లీ నితిన్ తో ఓ సినిమా తీస్తా.. ఈ సారి ఖచ్చితంగా హిట్ కొడతామని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఈ మాట నిలబెట్టుకునేందుకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట నితిన్. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పూర్తవ్వగానే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి నితిన్ నిర్మాతగా వ్యవహరించాలని తహతహ లాడుతున్నాడు. అఖిల్ సినిమాకు ప్రొడ్యూసర్ గా పనిచేసి వచ్చే క్రెడిట్ కొట్టేయాలని తహతహలాడుతున్నాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: