కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉంది. ప్రస్తుతం భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో కరోనా వైరస్ వ్యాపించి ఉంది. ఈ పరిణామంతో వివిధ దేశాల ప్రధానులు మరియు అధ్యక్షులు ఎక్కడికక్కడ కట్టడి చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వైరస్ ని అరికట్టడానికి షట్ డౌన్ చేసేస్తున్నారు. భారతదేశంలో కూడా వైరస్ రోజురోజుకీ ప్రబలడం తో...వైరస్ నిరోధించడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వైరస్ కి మందు లేకపోవడంతో...ఏ మాత్రం ఎటాక్ గట్టిగా అయినా ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయం మరియు పరికరాలు లేని నేపథ్యంలో...భూమి మీద మనిషి జీవనం ప్రశ్నార్థకంగా మారుతుందని అంటున్నారు చాలామంది.

 

ఈ నేపథ్యంలో దేశ ప్రధాని మోడీ కర్ఫ్యూ విధించడంతో అన్ని రంగాలు స్తంభించిపోయాయి. సినిమా షూటింగులు కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఎవరికి వారు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ భారీ ప్రాజెక్టులు చేపట్టడంతో అవి ఇప్పుడు సగంలో ఆగిపోవటంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి నష్టం బాగా వచ్చిందని...కొన్ని వందల కోట్లలో నిర్మాతలు ఇప్పుడు నష్టపోయారని ఇండస్ట్రీలో ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

 

ఇలా ఉండగా జనతా కర్ఫ్యూ బాగా పాటించడంతో వైద్యులకు తెలుగు సెలబ్రిటీలు చప్పట్లతో వీడియోలు చిత్రీకరిస్తూ వాళ్ళకి గౌరవాన్ని అందిస్తూ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టాప్ మోస్ట్ డైరెక్టర్లు హీరోలు అంతా కమెడియన్ lightman లతో సహా ఇంటికే పరిమితం కావడంతో...టాలీవుడ్ ఇండస్ట్రీ కరోనా వైరస్ వల్ల కొన్ని వందల కోట్లు నష్టపోవడం జరిగింది. మరోపక్క ప్రభుత్వ వర్గాలు మార్చి 31 వరకు వైరస్ అదుపులోకి వస్తుందో లేదో తెలియదు అంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: