మెగా స్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో "ఆచార్య" మూవీ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని, ఒక దేవాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో చిరంజీవి కనిపించనున్నట్టు ఇప్పటికే సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి. ముందు నుంచి కూడా ఈ మూవీ ఏదో ఒక విషయంలో ఆసక్తి రేపుతోంది అని చెప్పాలి. ఎందుకంటే తక్కువ నిడివి గల ఒక ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ లను సంప్రదించ గా వారిరువురు ట్రిపుల్ ఆర్ సినిమా లో బిజీ గా ఉండటం తో ఆ అవకాశం ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ను వరించింది. 

 

ఈ పాత్ర సెట్ అయిపొయింది అనుకునేలోపు హీరోయిన్ ఎవరనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. ముందు త్రిష ను చిరు పక్కన హీరోయిన్ గా ఎంపిక చేశారు, అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా  లో తెలిపారు. తరువాత అనుష్క ను సంప్రదించగా తను కూడా నో చెప్పిందని తెలిసింది. అయితే ఇప్పుడు ఈ అవకాశం కాజల్ అగర్వాల్ ను వరించినట్టూ వార్తలు వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో కాజల్ ను ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అని అడగగా కమలహాసన్ తో ఒక మూవీలోనూ, తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి పక్కన ఒక మూవీ లోనూ చేస్తున్నట్టు ఆమె తెలిపారు. 

 

ఇది తెలిసి ఈ కాంబినేషన్ మరొక్కసారి అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అని అంటున్నారు చిరంజీవి అభిమానులు. ఈ సినిమా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను జూన్ లేదా జులై నుంచి విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. త్వరలోనే తేదీ ప్రకటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: