`అల వైకుంఠపురములో` సినిమాతో సంక్రాంతి పండుగకు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. నాపేరు సూర్య దారుణంగా ఫ్లాప్ అవడంతో దాదాపు ఏడాదిన్నర పైగానే ఇంటికి పరిమితమైన అల్లు అర్జున్ ఆ టైంలో చాలా కథలు విని చివరాఖరికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన `అల వైకుంఠపురములో` సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సినిమా రిలీజ్ కాకముందే సాంగ్స్ పరంగా సోషల్ మీడియాలో సౌత్ ఇండియాలో ఏ సినిమా హీరో క్రియేట్ చేయని రికార్డులు అల్లు అర్జున్ క్రియేట్ చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఒక్కసారిగా అల్లు అర్జున్ రెమ్యునిరేషన్ ఏం చేశాడు. మొన్నటి వరకు 15 కోట్లు తీసుకున్నా అల్లు అర్జున్ తాజాగా దాన్ని డబుల్ చేస్తూ 30 కోట్లు సినిమాకి తీసుకోవటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

ముఖ్యంగా 'అల వైకుంఠపురం లో' సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులు పగల కొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేయడం తో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ అదిరిపోయే మాస్ మసాలా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో గంధపు చెక్కల స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటిస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో బన్నీ ఈ విధంగా రెమ్యూనరేషన్ పెంచడం పట్ల ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినబడుతున్నాయి.

 

అదేమిటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో సౌతిండియా పరంగా ఎక్కువ క్రేజ్ కలిగి ఉన్న హీరో అల్లు అర్జున్ కావటంతో...రజినీకాంత్ ని టార్గెట్ చేస్తూ ఆయనకి ఎసరు పెట్టే విధంగా...ఆయన త్వరలో రాజకీయాల్లోకి వెళ్లి పోవడం గ్యారెంటీ అయిన నేపథ్యంలో, తన మార్కెట్ ఈ విధంగా అల్లు అర్జున్ పెంచుకుంటూ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అక్కడున్న స్టార్ హీరోలెవరూ తమ సినిమాలు రిలీజ్ చేయటానికి సాహసించరు. అదేవిధంగా తమిళ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇక తెలుగులో అయితే ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తంమీద చూసుకుంటే సౌతిండియా సూపర్ స్టార్ హీరోగా అల్లు అర్జున్ అవతరించడానికి రెడీ అవుతున్నాడని ఇండస్ట్రీలో ఉన్న వారు కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: