టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్స్ లో బాలకృష్ణకు స్పెషల్ ప్లేస్ ఉంది. సినిమా తెరకెక్కే సమయంలో దర్శకుల ఫ్రీడంకు అడ్డు చెప్పని బాలయ్యతో సినిమా చేయాలనుకునే నిర్మాతలు, దర్శకులు ఎక్కువే. దీంతో పాటు బాలయ్యకు రీమేక్ సబ్జెక్ట్స్ చేయడనే మరో పేరు ఉంది. 2004లో వచ్చిన లక్ష్మీనరసింహ తర్వాత మరే రీమేక్ సబ్జెక్ట్ ను బాలయ్య టచ్ చేయలేదు. కానీ ఇప్పడు బాలయ్య వద్దకు ఓ మళయాళ రీమేక్ వెళ్లిందని సమాచారం.

 

 

మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యపాణుమ్ కౌశియుమ్’ అనే మూవీ రీమేక్ రైట్స్ ను సితార ఎంటర్ టైన్మెంట్స్ తీసుకుందని సమాచారం. ఈ సినిమా ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కు ఓ హవాల్దార్ కు మధ్య జరిగే కథ. పృథ్వీరాజ్ బిజూ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుందట. ఇందులోని ఓ పాత్రకు బాలకృష్ణ అయితే కరెక్ట్ గా సూటవుతాడని భావిస్తోందట సితార యూనిట్. దీంతో ఈ సబ్జెక్ట్ ను బాలయ్యకు వినిపించేందుకు ప్లాన్ చేస్తున్నారట. కానీ.. బాలయ్య రీమేక్ సబ్జెక్ట్స్ పై పెద్దగా ఆసక్తి చూపించడనే విషయం తెలిసిందే. కథ ప్రకారం ఇంపార్టెంట్ రోల్ కావడంతో బాలయ్యను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

 

 

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చక్కబడ్డ తర్వాతే ఈ ప్రాజెక్టు విషయం బాలయ్యకు చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం రౌండ్ అవుతున్న ఈ వార్తపై అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది. తనకు కథ నచ్చితే సెట్స్ పైకి వెళ్లిన తర్వాత దర్శకుడిపై పూర్తి నమ్మకంతో స్వేచ్ఛ ఇస్తాడని బాలయ్యకు పేరు. మరి ఈ సినిమా నచ్చితే బాలయ్య ఓకే చెప్పినట్టే. రీమేక్ లు ఇష్టపడని బాలయ్య నిర్ణయమేంటో చూడాల్సిందే. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: