ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా చెలరేగిపోతున్న ఇద్దరంటే ఇద్దరే. ఆ ఇద్దరే కన్నడ బ్యుటి రష్మిక మందన్న, పూజా హెగ్డే. పూజా హెగ్డేకి మన తెలుగు ఇండస్ట్రీలో ముందు నుంచి పేరు ఉంది. కాని తనే బాలీవుడ్ మీద మోజుతో రెండేళ్ళు తెలుగు సినిమాలకి దూరంగా ఉంది. మళ్ళీ దువ్వాడ జగన్నాధం సినిమాతో టాలీవుడ్ కి వచ్చింది. ఆ సినిమా తర్వాత పూజా హెగ్డే స్టార్ గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో రష్మిక మందన్న, పూజా హెగ్డే లను మాత్రమే హీరోయిన్లుగా మేకర్స్ ఎంచుకుంటున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలతో పాటు రెండు టాలీవుడ్ సినిమాలు చేస్తుంది. ఇక రష్మిక సుకుమార్ అల్లు అర్జున్ సినిమాలో చేస్తుంది. ఇవి కాకుండా ఈ ఇద్దరికి మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి.

 

అయితే వాస్తవంగా ఈ ఇద్దరికంటే ముందు స్టార్ గా వెలగాల్సిన అమ్మడు మాత్రం అసలు అడ్రస్ లేకుండా పోయింది.వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ కి వరుస హిట్లతో పాటుగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చాయి. వాటిలో చాలా సినిమాలతో సక్సెస్ కూడా అందుకుంది. కానీ సడెన్ గా బ్యాడ్ లక్ స్టార్ట్ అయి ఒక్కసారిగా టాలీవుడ్ ని వదిలేసింది. అయితే ఒక్క సినిమా చేసిన రకుల్ మరో సినిమాతో ఏదో నెట్టుకొస్తుంది తప్ప బాలీవుడ్ లో అంత గా చెప్పుకునే క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమీ లేకపోవడం ఆసక్తికరమైన విషయం. సీనియర్ హీరోలతో తప్ప యంగ్ హీరోల సినిమాలో అవకాశాలు తెచ్చుకోలేకపోతుంది. 

 

తెలుగులోనూ నాగార్జునతో చేసిన మన్మధుడు 2 డిజాస్టర్ కావడంతో ఇక టాలీవుడ్ లో రకుల్ కి అవకాశాలు లేకుండా పోయాయి. ప్రస్తుతానికి ఆమె చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిపోతుందనుకున్న రకుల్ కాస్త దూరంలో ఆ స్టేటస్ ని అందుకోలేకపోయింది. వాస్తవంగా అయితే రకుల్ చేసిన సినిమాలకి ఈ రోజు నంబర్ వన్ పొజిషన్ లో ఉండాల్సింది. కాని తనని ఇప్పుడు పట్టించుకుంటున్న నాధుడే కరువయ్యాడు. దాంతో రకుల్ ని   కావాలనే తొక్కేశారని అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: