టాలీవుడ్ పరిశ్రమలో అడుగు పెట్టిన కొన్ని రోజుల్లోనే ఆర్ కే రోజా స్టార్ హీరోల సరసన నటించి బాగా పాపులర్ అయ్యింది. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి అప్పట్లో టాలీవుడ్ మహారాణిలా కొనసాగిన రోజా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా తన సత్తా చాటుతోంది. మరోవైపు దక్షిణ భారతదేశంలోనే అత్యంత పాపులర్ అయిన జబర్దస్త్ కామెడీ షో లో గత ఏడు సంవత్సరాలుగా న్యాయనిర్ణేతగా బాధ్యతలు వహిస్తుంది. అయితే ఆమెతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా జబర్దస్త్ ప్రోగ్రాం కి గత సంవత్సరం వరకు జడ్జి బాధ్యతలను చేపట్టారు. కానీ ఏవో కారణాల వలన తాను జబర్దస్త్ వదిలి వెళ్లిపోవడంతో రోజానే ఆ షో కి లీడర్ అయ్యింది.





అలాగే జబర్దస్త్ షో ని ఒంటిచేత్తో నడిపిస్తుండటంతో ఆమె రెమ్యునరేషన్ నెలకు రూ.20 లక్షల నుండి రూ. 30 లక్షలకు జబర్దస్త్ యాజమాన్యం పెంచారని సమాచారం. పెద్దతల లాగా నాగబాబు జబర్దస్త్ లో ఉన్నపుడు కమెడియన్లు అతని మాట జవదాటకుండా ఉంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్కిట్లు చేసేవారు. కానీ ఎప్పుడైతే నాగబాబు వెళ్ళిపోయారో అప్పటినుండి తమ ఇష్టారాజ్యంగా నడుచుకుంటున్నారు కమెడియన్లు. రోజా కూడా ప్రతి స్కిట్ లో తలదూర్చుతూ జబర్దస్త్ కామెడీ షో ని మొత్తం పాడు చేస్తుంది. దాంతో యాజమాన్యానికి రోజా ప్రవర్తన పెద్ద తలనొప్పిగా మారిందని తెలుస్తోంది.



అయితే తాజాగా ఆమె అంతట ఆమె జబర్దస్త్ షో నుండి బయటికి వచ్చేసిందని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి కారణం ఒక గొడవని తెలుస్తోంది. వివరాలు తెలుసుకుంటే... ఇటీవల విడుదలైన ఓ జబర్దస్త్ ప్రోమో లో ఒక స్కిట్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్ ఆసమ్ అప్పి ని ఓ బెత్తం తీసుకుని వాతలు పడేటట్టు కొడతాడు. దాంతో నొప్పి భరించలేక ఆసమ్ అప్పి నిజంగానే బుల్లెట్ భాస్కర్ ని దూషిస్తూ... కాలుతో తన్నేసి స్టేజి దిగి వెళ్ళి పోతాడు. అయితే రోజా కి వీరిద్దరూ ఇలా ప్రవర్తించడం అసలు నచ్చలేదట. అలాగే యాజమాన్యం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నందుకు మండి పడిందట. తనకు ఇష్టం లేకుండా ఇటువంటివి చేస్తున్నందుకు తాను ఈ షో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిందట. ఏది ఏమైనా ఆమె జబర్దస్త్ షో నుండి శాశ్వతంగా తప్పుకున్నదో లేకపోతే చిన్న బ్రేక్ తీసుకున్నదో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: