వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం భీష్మ. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సేంద్రీయ వ్యవసాయం గురించిన ఆవశ్యకతని తెలియజేసింది. త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన వెంకీ ఛలో సినిమా ద్వారా దర్శకుడిగా మారి ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత నితిన్ చేసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించింది.

 


అయితే ఇంకా పెద్ద హిట్ కావాల్సిన చిత్రం సగంలోనే ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. ఏ స్టార్ హీరోతోనే సినిమా తీసుంటే రేంజ్ మరింత పెరిగేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అదీగాక భీష్మ రిలీజ్ చేసిన టైమ్ కూడా సరైనది కాదనే వాదన కూడా వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాల సందడి పోయిన్ తర్వాత రిలీజ్ అయినప్పటికీ, అప్పటికి ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఎగ్జామ్స్ పనిలో బిజీగా ఉండడం వల్ల ఫ్యామిలీస్ ఎవరూ థియేటర్లకి రాలేదు.

 


అందువల్ల సినిమాకి రావాల్సినంత కలెక్షన్లు రాలేవని టాక్. అయితే ప్రస్తుతం ఈ సినిమా హిందీలోకి రీమేక్ కానుందనే వార్త వినిపిస్తుంది. టాలీవుడ్ చిత్రాలపై ఓ కన్నేసిన కరణ్ జోహార్ భీష్మ చిత్రాన్ని హిందీలోకీ రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హిందీ రీమేక్ లో స్టార్ హీరోలలో ఒకరైన రణ్ బీర్ కపూర్ నటించనున్నాడని వినిపిస్తుంది. రణ్ బీర్ కపూర్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమాలో చేస్తున్నాడు.

 


భీష్మ లాంటి యూనివర్సెల్ యాక్సెప్టెన్సీ ఉన్న కథ హిందీలో కూడా బాగా వర్కౌట్ అవుతుందని అంటున్నారు. ఇక రణ్ బీర్ కపూర్ లాంటి హీరో ఈ సినిమాలో హీరోగా చేస్తే మరింత బాగుంటుందనే వాదన వినిపిస్తుంది. అధికారికంగా వెలువడితే తప్ప ఈ విషయంలో ఓ క్లారిటీ రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: