కరోనా ప్రభావంతో ప్రపంచమంవతా చిగురుటాకులా వణికిపోతోంది. చైనాలో దారుణమైన పరిస్థితుల తరువాత అంతకన్నా ఎక్కువగా నష్టపోయిన దేశం ఇటలీ. ఇక్కడ రోజు వందల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. వేలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం బాధితులందరికీ చికిత్స అంధించగలిగే పరిస్థితిలో కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఇటలీ పట్ల జాలీ చూపించటం తప్ప ఏం చేయలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఇటలీకి తమ సంఘీభావం తెలుపుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయన్ కరీన్ కపూర్ కూడా తన సంఘీభావాన్ని తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో గతంలో భర్త సైఫ్ అలీఖాన్ తో కలిసి ఇటలీలో దిగిన ఫోటో ను పోస్ట్ చేసిన కరీనా.. `మేము ఇటలీ కోసం ప్రార్థిస్తున్నాం` అంటూ కామెంట్ చేసింది. కరీనాతో పాటు మరికొందరు బాలీవుడ్, హాలీవుడ్ తారలు కూడా ఇటలీ కోసం ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే కరీనా ప్రస్తుతం రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. కరణ్ జోహర్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తఖ్త్ తో పాటు ఆమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్ధా సినిమాలోనూ నటిస్తోంది కరీనా. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి.