టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మ్యాట్ని ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగాస్టార్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని రేపు ఉగాది సందర్భంగా ఎనౌన్స్ చేయబోతున్నట్టు గా ఇప్పటికే టాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

 

ఇకపోతే నేడు మెగాస్టార్ తన ఫ్యాన్స్ కు ఒక అద్భుతమైన న్యూస్ చెప్పి అందరిలోనూ మంచి జోష్ నింపారు. వివరాల్లోకి వెళితే, కాసేపటి క్రితం ఒక వీడియో బైట్ ని విడుదల చేసిన మెగాస్టార్, తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా రేపటినుండి ఇకపై తన అభిమానులకు అలానే ప్రేక్షకులకు చేరువ అయ్యేలా పలు సోషల్ మీడియా వేదికల్లో ఎకౌంట్స్ ఓపెన్ చేయబోతున్నట్టు తెలిపారు. ఈ విధంగా సోషల్ మీడియా మాద్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత మరియు సినిమా సంగతులను ఫ్యాన్ కు తెలపడంతో పాటు ఏదైనా విషయమై తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడంలో ఈ మాధ్యమాలు మంచి వారధులుగా ఉంటాయని మెగాస్టార్ తన వీడియోలో తెలిపారు. 

 

ఇప్పటికే దాదాపుగా మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటున్న విషయం తెలిసిందే. కాసేపటి క్రితం విడుదలైన మెగాస్టార్ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. రేపు ఉగాది పండుగ సందర్భంగా మెగాస్టార్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందుబాటులోకి రానున్న విషయం బయటకు వెలువడటంతో మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా విపరీతంగా సంబరాలు మొదలయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: