కరోనా ప్రభావంలో ఇళ్లకే పరిమితమైన ప్రజలను సోషల్ మీడియా ద్వారా ఎంటర్ టైన్ చేస్తున్నారు కొంతమంది సినీ ప్రముఖులు. బాలీవుడ్ హాట్ బ్యూటీలు వర్క్ అవుట్ వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఇన్స్పైర్ చేస్తుంటే. కొంతమంది ఫన్నీ వీడియోస్ తో అలరిస్తున్నారు. తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఓ ఫన్నీ వీడియోను తన ఇన్స్టా గ్రామ్ పేజ్ లో షేర్ చేశాడు. ఇప్పటికే అభిమానులకు లాక్ డౌన్కు సహకరించాల్సిందిగా విన్నవిస్తూ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు పూరీ.
తాజా తన సోషల్ మీడియా పేజ్లో `మీరు ఇక బోర్ ఫీల్ అవ్వరు. ఇంట్లోనే ఇలా హర్స్ రైడింగ్ చేయండి. మీరు ఆనందం పొందుతారు` అంటూ కామెంట్ చేశాడు. ఫన్నీగా ఉన్న ఈ వీడియో పూరి పోస్ట్ చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ మల్టీ లింగ్యువల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ తో కలిసి పూరీ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో పాటు తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా కార్యక్రమాలు ఆగిపోవటంతో ఈ సినిమా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
View this post on Instagram