టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి చేయబోయే సినిమా కోసం ఫిజికల్ గా మంచి ఫిట్ గా తయారవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన సూపర్ స్టార్, తదుపరి గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో చేయనున్న సినిమా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. రేపు ఈ సినిమాకు సంబందించిన అఫీషయల్ న్యూస్ బయటకు రానున్నట్లు టాక్. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా ఈ సినిమాతో నిర్మాతగా మారబోతున్నట్లు సమాచారం. 

 

ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ బాబు, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నారట. వాస్తవానికి ఎప్పుడో మహేష్ బాబు ఈ బ్యానర్ లో సినిమా చేయాల్సి ఉందని, అలానే ప్రస్తుతం పరశురామ్ తో చేయనున్న సినిమా కూడా మొదట్లో గీత ఆర్ట్స్ లోనే అనుకున్నారట. అయితే కొన్ని కారణాల వలన అది వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. అయితే రాబోయే మరికొద్దిరోజుల్లో మహేష్ బాబు, గీత ఆర్ట్స్ లో ఒక సినిమా చేయడం ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఒక అగ్ర దర్శకుడు తెరెక్కించే ఈ సినిమాని అల్లు అరవింద్ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారని అంటున్నారు. 

 

ఇప్పటికే మెగాస్టార్ తో కలిసి ఆచార్య సినిమాలో ఒక కీలక పాత్రలో మహేష్ నటించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆయన గీత ఆర్ట్స్ లో కూడా అతి త్వరలో సినిమా చేయనుండడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి ఇప్పటివరకు మరే పెద్ద హీరోతో కూడా గీత ఆర్ట్స్ వారు సినిమా చేసింది లేదు. మరి ఈ వార్త కనుక నిజం అయితే, ఫస్ట్ టీమ్ అది మహేష్ బాబు తోనే సాధ్యం అవుతుందనే చెప్పాలి. ఈ విధంగా అటు మెగాస్టార్ మూవీలో నటిస్తూ, మరోవైపు గీత ఆర్ట్స్ లో కూడా సినిమా చేస్తూ, మహేష్ బాబు మెగాకోట లో జండా పాతనున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే, అటు మెగా, ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇద్దరికీ కూడా ఇది మంచి పండుగ న్యూస్ అనే చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: