రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి దూకుడు గా సినిమాలు చేస్తున్నారు. జాగ్రత్తగా సినిమాలు చేస్తూ ముందుకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యే దశలో ఉంది. అయితే కరోనా వైరస్ ఇప్పుడు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో చిరంజీవి తన సినిమా షూటింగ్ నుంచి బయటకు వచ్చేశారు. అలాగే అందరూ కూడా సినిమా షూటింగ్ లో ఉండవద్దు అని ఆయన అందరికి సూచించారు కూడా. ఈ సినిమాలో చిరంజీవి మావోయిస్ట్ గా నటిస్తున్నారు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన లూసిఫర్ రీమేక్ చేయడం లేదని అంటున్నారు. ఆ సినిమా షూటింగ్ విషయంలో ఆయన అంత ఆసక్తికరంగా లేరని అంటున్నారు. ఆ కథ తెలుగు కి తగ్గట్టు లేదని కాబట్టి వద్దని చెప్తున్నారట. రామ్ చరణ్ కి ఈ విషయం ఇప్పటికే చిరంజీవి చెప్పెసారట. దీనితో ఈ సినిమా షూటింగ్ వద్దని కూడా చెప్పారట. త్వరలో ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టాలని భావించారు. అయితే కథలో పట్టు లేదని అక్కడి వాళ్లకు నచ్చుతుంది గాని ఇక్కడి వాళ్లకు అది నచ్చే అవకాశం లేదని అనవసరంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారట. 

 

చిరంజీవి చెప్పిన విషయాన్ని ఆలోచించిన రామ్ చరణ్ ఆ కథ విషయంలో వెనక్కు తగ్గారట. ఈ సినిమా తర్వాత చిరంజీవి రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా చర్చలు కూడా పూర్తి కాగా ఆ సినిమాను నిర్మించడానికి రామ్ చరణ్ ముందుకి వచ్చాడని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన కథను ఫైనల్ చేసి అప్పుడు షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని కరోనా కారణంగా ఇప్పుడు వాయిదా పడ్డాయని అంటున్నారు. ఈ సినిమా చిరంజీవి చేస్తే వీరి కాంబినేషన్ లో వచ్చిన 15 వ సినిమా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: