కరోనా వైరస్ ప్రభావం తో ఇప్పుడు ఏ హీరో కూడా బయటకు రావడం లేదు. సినిమా స్టార్ హీరోలు అందరూ కూడా ఇళ్ళల్లోనే ఉంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. హీరోలు అందరూ కూడా ఇప్పుడు ఈ విషయంలో జాగ్రత్తలు ఎక్కువగానే తీసుకుంటున్నారు. బయటకు వెళ్ళకుండా ఉండాలని, అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సూచనలు చెయ్యాలని భావిస్తున్నారు. ఎంతటి స్టార్ హీరో అయినా సరే బయటకు వద్దనే భావనలో ఉన్నాడు. ఇక అవసరం అనుకుంటే ప్రభుత్వాలకు ఆర్ధిక సహాయం కూడా అందించాలని భావిస్తున్నారు. 

 

మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఏ స్టార్ హీరో బయటకు వచ్చినా సరే వాళ్ళ మీద ఉన్న అభిమానం తో అందరూ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళే బయటకు రాకుండా కనీసం వాళ్ళ సమాచారం కూడా మీడియాకు తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఇలా ప్రతీ ఒక్కరు కూడా ఇళ్ళకు పరిమితం అయ్యే పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా లో కొందరు హీరో లు ఫోటోలు ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు. తాము ఇంట్లో ఉండి ఎం చేస్తున్నారో చెప్తున్నారు. 

 

కరోనా వైరస్ మహమ్మారి ని ఏ విధంగా అయినా అడ్డుకోవాలని వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా కట్టడి లోనే ఉంది. అందుకే స్టార్ హీరోలు కూడా ఇళ్ళల్లోనే ఉంటూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు అనే చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఇప్పుడు వాళ్ళ గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇంట్లో నుంచి ఎవరూ కూడా బయటకు రాకుండా ఉండే విధంగా వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు పడుతున్నారు. తమ వారిని కూడా ఇంటి నుంచి బయటకు రానీయడం లేదు హీరోలు.

మరింత సమాచారం తెలుసుకోండి: