కరోనా వైరస్ ఎవరిని ఇబ్బంది పెట్టిందో గాని సినిమా ప్రేక్షకులను మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది అనేది మాత్రం వాస్తవం. స్టార్ హీరోల అభిమానులు దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అనేది అర్ధమవుతుంది. ఒక్క సినిమా షూటింగ్ కూడా ముందుకి వెళ్ళే అవకాశం కనపడటం లేదు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా స్టార్ హీరోల అభిమానులు అయితే ఫస్ట్ లుక్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇతర భాషలు ఏమో గాని మన తెలుగులో మాత్రం ఫాన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్నారు.

 

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలు గా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. ట్రిపుల్ ఆర్ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమా ఇప్పటికే మూడు సార్లు విడుదల వాయిదా పడింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తారని అనుకున్నారు. అయితే కరోనా వైరస్ నేపధ్యంలో అది వాయిదా పడింది. కనీసం ఫస్ట్ లుక్ అయినా వస్తుంది అని భావించారు అందరూ. కాని అది మాత్రం సాధ్యం అయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

 

రామ్ చరణ్ లుక్ అతని పుట్టిన రోజు కానుకగా వస్తుంది అని భావించారు అందరూ. కాని ఇప్పుడు కరోనా దెబ్బకు అది కూడా వచ్చే అవకాశం లేదని అంటున్నారు. అసలు ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందో చెప్పలేరు.ఇక ప్రభాస్ సినిమా విషయంలో కూడా దాదాపుగా ఇదే జరిగింది. అతని సినిమా ఫస్ట్ లుక్ వస్తుంది అనుకున్నారు. అది కూడా వచ్చే అవకాశాలు కనపడటం లేదు. అలాగే మరికొందరు హీరోల సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్స్ వస్తాయని చూసారు. కాని అవి కూడా ఎక్కడా వచ్చే అవకాశాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: