ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ కరోనా వైరస్. ఇది ప్రపంచాన్ని  గడగడలాడిస్తుంది. ఈ కరోనా వైరస్ ప్రభావం వలన దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ఇండ్ల నుంచి ప్రజలు బయటికి రావటం లేదు. అలాగే ఇంట్లో నుంచి ప్రజలు బయటకు రాకుండా కూడా ప్రభుత్వాలు పటిష్ఠంగా నిర్ణయాలు తీసుకుని హెచ్చరిస్తున్నారు. ఈ నిర్ణయాలను ఎవరైనా పాటించకపోతే నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ హెచ్చరికలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసి జైలుకి పంపిస్తున్నారు. 

 

 

ఇక ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించటంతో సెలబ్రిటీలు ఇళ్ళకి పరిమితమయ్యే వారి వారి కుటుంబాలతో సంతోషంగా గడుపుతున్నారు. క్వారంటైన్ పేరుతో ఇళ్ళల్లో ఉన్న సినీ ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసిన పనులను వీడియో తీసి మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంకొంత మంది ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే.. హీరో నాని మాత్రం కొన్ని కొన్ని ఆసక్తికరమైన వీడియోలను ఒక్కొక్కటిగా మీడియాలో షేర్ చేస్తున్నారు.

 

 

అయితే.. తాజాగా హీరో నాని తమ ఇంటి బాల్కనీ పైన ఉన్న చెట్టు మీద ఒక పిట్ట గుడు పెట్టి అది పిల్లల్ని పొదగడాన్ని తన ఫోన్ లో పిక్ తీసి తమ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఇన్ని రోజులు బిజీగా ఉండి ఈ విషయాన్ని గమనించలేక పోయానని ఆయన పేర్కొన్నారు. తర్వాత చెట్టుని పిట్టని.. పిట్ట పిల్లని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ అయింది. 

 

 

దీంతో నాని మరో వీడియోని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఆ విషయం ఏంటంటే.. గరిటె పట్టుకుని వంట చేయటం అలవాటు ఉన్న నాని ఇప్పుడు తమ ఇంట్లోని వంట గదిలో మసాలా శనగ కర్రీ చేస్తున్నాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: