రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రం నుండి ఉగాది కానుకగా రేపు టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్... ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం రేపు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రావడం లేదని తెలుస్తుంది. అయితే మేకర్స్ కూడా ఉగాదికి అప్డేట్ ఇస్తామని ఎక్కడ చెప్పలేదు కానీ ఈ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ మాత్రం త్వరలోనే ఫస్ట్ లుక్ వస్తుందని ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడించే సరికి ఫ్యాన్స్ ఉగాదికి విడుదలవుతుందోమో అనుకున్నారు కానీ ఫస్ట్ లుక్ విడుదలకు మరి కొన్ని రోజుల సమయం పట్టేలానే వుంది.
 
ఇక కొద్దీ రోజుల క్రితమే హడావిడిగా జార్జియా షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకొని చిత్ర బృందం ఇండియా కు తిరిగివచ్చింది. ప్రస్తుతం కరోనా, ఇండియా ను వణికిస్తున్న విషయం తెలిసిందే దాంతో బయటి దేశం నుండి రావడంతో ప్రస్తుతం ప్రభాస్ తో సహా చిత్ర యూనిట్ స్వీయ నిర్బంధం లో వున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తుండగా ఈచిత్రానికి ఓడియర్ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్నిగోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా తెలుగుతో పాటు తమిళ , హిందీ భాషల్లో ఈఏడాది చివర్లో విడుదలకానుంది.
 
ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తన 21 వ చిత్రంలో నటించనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో తెరకెక్కనున్న ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ నిర్మించనుంది. వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: