మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుని స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. వేణు లయ జంటగా నటించిన స్వయంవరం సినిమాతో రచయుతగా ప్రయాణం మొదలు పెట్టిన త్రివిక్రమ్ ఆ తర్వాత డైరెక్టర్ విజయ్ భాస్కర్ తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి రచయితగా పని చేశారు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు వంటి సూపర్ హిట్ చిత్రాలకి రచయితగా డైలాగ్స్ అందించారు. ఆ తర్వాత తరుణ్ శ్రియ జంటగా నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారారు. 

 

సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించిన అతడు సినిమా త్రివిక్రమ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ని చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా, అత్తారింటికి, అజ్ఞాతవాసి, మహేష్ బాబు తో ఖలేజా, అల్లు అర్జున్ తో జులాయి, సనాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత వీర రాఘవ తో పాటు మరీ కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే మన మాటల మాంత్రీకుడు కథ, మాటలు, దర్శకత్వంలో సక్సస్ ఫుల్ గా కొనసాగుతున్నారు. ఈ మూడింటిలో గురూజీని కొట్టిన వాడే లేడని చెప్పొచ్చు. ఇక్కడదాకా బాగానే ఉంది. కాని ఇప్పుడు ఆయన అనుకుంటున్న విషయమే అందరిని కలవరపెడుతుంది. 

 

అదే ఆయన నిర్మాతగా మారడం. ఇంతకముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - యంగ్ హీరో నితిన్ తో కలిసి 'చల్ మోహన రంగా' సినిమాని నిర్మించి దెబ్బ తిన్నారు త్రివిక్రమ్. కానీ ఈసారి మాత్రం నిర్మాతగా సక్సస్ అవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. అల్లు అర్జున్ తో బన్నీతో నిర్మాతగా సినిమా తీయాలని భావిస్తున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం సుకుమార్ తో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కంప్లీటవగానే మరోసారి గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసిని బ్యానర్ లో త్రివిక్రమ్ అల్లు అర్జున్ హీరోగా సినిమాని కమిటయ్యారు. ఈ సినిమాకే త్రివిక్రమ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. కాని ఇది కొంతమందికి నచ్చడం లేదు. ఇప్పటి వరకు సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇప్పుడు  నిర్మాతగా రిస్క్ ఎందుకని అంటున్నారట. అయితే త్రివిక్రమ్ కి మాత్రం ఆన్ స్క్రీన్ మీద తన పేరు ని చూసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: