టాలీవుడ్ టాప్ హీరోలు.. మ‌హేశ్‌బాబు, రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌.. ప్ర‌స్తుతం వీరు ఇండ‌స్ట్రీని ర‌ఫ్పాడిస్తున్నారు. సినిమాల‌తో నిత్యం తీరిక‌లేకుండా ఉంటూనే బిజినెస్ మూడ్‌లోకి కూడా వెళ్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాల్లో బిజీబిజీగా ఉంటూనే వ్యాపారరంగంలో అడుగుపెడుతున్నారు. బిజినెస్‌లోనూ హీరోస్‌గా వెలుగొందాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. ఇప్ప‌టికే ఈ విష‌యంలో హీరో మ‌హేశ్‌బాబు ఒక అడుగు ముందే ఉన్నారు. సొంతంగా  ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా ప్రారంభించారు. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు కూడా స్టార్ట్ చేశారు. అంతేగాకుండా.. ఏఎంబీ సినిమాస్‌ను ఏర్పాటు చేసి థియేట‌ర్ మేనేజ్‌మెంట్‌లోనూ ఆయ‌న అడుగుపెట్టారు. అలాగే.. రాంచ‌ర‌ణ్ కూడా సొంతంగా కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను ప్రారంభించి, నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మొద‌టి ప్ర‌య‌త్నంలో సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాతో మాంచి హిట్‌ను అందుకున్నారు. చిరంజీవి హీరోగా న‌టించిన ఈ సినిమా తెలుగులో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

 

తాజాగా.. జూనియ‌ర్‌ ఎన్టీఆర్ కూడా సొంతంగా ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను ప్రారంభిస్తున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. తన తండ్రి హరికృష్ణ పేరు మీద నిర్మాణ సంస్థ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. థియేట‌ర్ మేనేజ్‌మెంట్‌లో కూడా అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే.. రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా థియేట‌ర్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెడుతున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ ముగ్గురు సౌత్ ఇండియాలో మల్టీప్లెక్స్ చైన్‌ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి.. టాలీవుడ్‌లో ప‌లువురు వ్యాపార‌రంగంలో అడుగుపెట్టి రాణించారు. మ‌రికొంద‌రు న‌ష్ట‌పోయారు కూడా.. హీరో అక్కినేని నాగార్జునతోపాటు ప‌లువురు మాత్రం వ్యాపార రంగంలో రాణించార‌ని చెప్పుకోవ‌చ్చు. మ‌రి.. తాజాగా ఈ స్టార్ హీరోలు రాంచ‌ర‌ణ్‌, మ‌హేశ్‌బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌లు ఒక గ్రూప్‌గా ఏర్ప‌డి.. వ్యాపారంపై ద‌ష్ట‌పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే వీరి మేనేజ‌ర్ల ద్వారా ఫైనాన్షియ‌ల్ విష‌యాల‌ను చ‌ర్చిస్తున్న‌ట్లు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వీరు అనుకున్న‌ది అనుకున్న‌ట్లు జ‌రిగితే మాత్రం.. ఇండ‌స్ట్రీని ఏల‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి వీరు ఏమేర‌కు రాణిస్తారో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: