బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ ఈ హాట్ బ్యూటీ పేరు తెలియ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. తెలుగులో ఒక‌టి, రెండు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఈమె టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మున్న భామ అనే చెప్పాలి. మ‌ల్లీశ్వ‌రి చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయింది ఈ భ‌మ‌. ఆ త‌ర్వాత  బాలయ్య సరసన నటించే ఛాన్స్ దక్కింది. అల్లరి పిడుగులో బాలకృష్ణ‌కు జోడీగా కత్రినా యాక్ట్ చేసింది కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత హిట్ కాలేక‌పోయింది. టాలీవుడ్ లో కత్రినాకు అవకాశాలు సన్నగిల్లాయి. ప్ర‌స్తుతం బాలీవుడ్ చ‌క్రం తిప్పుతున్న భామ‌. ఈ భామ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తోన్న సూర్యవంశీలో కీలకపాత్ర చేస్తోంది.

 

ఇదిలా ఉండగా…కరోనా ధాటికి సినిమా షూటింగ్స్ అన్నీ  కూడా ఎక్క‌డిక‌క్క‌డ  ఆగిపోయాయి. దీంతో హీరో, హీరోయిన్స్ అంత ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక వాళ్ళ ఇళ్ళ‌ల్లో ప‌ని చేసే వారిని కూడా ఆఖ‌రికి రానివ్వ‌డంలేదో ఏమో మ‌రి. ఈ భామ త‌న ప‌నిని తానే చేసుకుంటుంది. ఏంటా ఆ ప‌ని అనుకుంటున్నారా ఇదిగోండి  తాను తిన్న గిన్నెలను తోముతూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలలో పోస్ట్ చేసింది. కత్రినా కైఫ్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చ‌ల్ చేస్తోంది.

 

అయితే ఈమె వీడియోని పోస్ట్ చేయ‌డ‌మే కాక అందులో గిన్నెల‌ను ఎలా తోముకోవాలి. వాట‌ర్ తో  మొత్తం  సింక్‌లో నింపుకుని అప్పుడు నీటిగా ప్లేట్ల‌ను క‌డ‌గాలి అని శుభ్ర‌త గురించి ఏకంగా ఒక వీడియో తీసి మ‌రీ ఈ భామ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అంద‌రికి చూపిస్తోంది. అన్న విష‌యాలు కూడా వివ‌రంగా చెబుతుంది. దీనికి కొంత మంది సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. ఇక ఈ భామ‌కి ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌, నాగఅశ్విన్ సినిమాలో న‌టించే అవ‌కాశ‌మున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్ర‌భాస్ ఎలాగైనా క‌త్రినాని పెట్టుకోవాలిన ఆలోచిస్తున్నార‌ట‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు వ‌ర్క్ అవుట్ అవుద్దో వేచి చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: