బాహుబలి సినిమా ద్వారా నేషనల్ స్టార్ అయిపోయిన ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో ఓ డియర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. మొన్నటి వరకు జార్జియాలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా క్యాన్సిల్ చేసుకుని ఇండియాకి తిరిగొచ్చేశారు. ప్రస్తుతం జార్జియా నుండి వచ్చిన యూనిట్ అంతా ప్రభాస్ తో కలిపి అందరూ హోమ్ క్వారంటైన లో ఉన్నారు. 

 

 


అసలే ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా జరుగుతుంది. ఇప్పటికీ ఇంకా వేగం పుంజుకోలేదు. ఇప్పుడు కరోనా కారణంగా ఇది మరింత ఆలస్యం కానుంది. అయితే ఈ ఆలస్యం మరింత ఆలస్యం కానుందేమో అనిపిస్తుంది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే చాలా బిజీ ఆర్టిస్ట్.  తెలుగులో ప్రభాస్ తో పాటు అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రంలోనూ నటిస్తుంది.

 

 

ఇదే కాదు బాలీవుడ్ లో సల్మాన్ సరసన ఛాన్స్ కొట్టేసింది. మోస్ట్ ఎలిజిబుల్ చిత్రంలో పూజా హెగ్డేతో చిత్రీకరించాల్సిన సన్నివేశాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అదీ గాక సల్మాన్ తోనూ సినిమా ఒప్పుకుని డేట్లు ఇచ్చేసింది. కరోనా ప్రభావం తొలగిపోయేసరికి సల్మాన్ సినిమా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రభాస్ సినిమా మరింత ఆలస్యం అవుతుందేమో అనిపిస్తుంది.

 

 


అయితే కరోనా వల్ల అన్ని సినిమా షెడ్యూల్లు వాయిదా పడ్డ నేపథ్యంలో పూజా హెగ్డే ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. ఓ డియర్ మూవీ పూర్తిగా ప్రేమ కథ కాబట్టి పూజాహెగ్డే ఖచ్చితంగా ఉండాల్సిందే. అసలే నత్తనడకన నడుస్తున్న షూటింగ్ ని పూజా హెగ్డే మరింత లేట్ చేస్తుందా లేదా ప్రభాస్ సినిమాకి ఇంపార్టెన్స్ ఇచ్చి షూటింగ్ ఫాస్ట్ లా అవడంలో చేయూతనిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: