తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెరపై శాంతి నివాసంతో తన ప్రస్థానం మొదలు పెట్టిన రాజమౌళి వెండి తెరపై జూ. ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో తన కెరీర్ మొదలు పెట్టాడు.  ఇదే ఎన్టీఆర్ తో సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించారు.  ఇలా వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న రాజమౌళి ‘ఈగ’ చిత్రంతో ఓ వండర్ సృష్టించాడు.  హీరో ఆత్మ ఈగలోకి ప్రవేశించి విలన్ భరతం పెట్టే విధానం స్క్రీన్ పై గ్రాఫిక్ మాయాజాలంతో అద్భుతాన్ని సృష్టించారు.  ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి 2’ లో ఇండియన్ మూవీస్ ఏనాడు చేయని వ్యూజువల్ వండర్స్ క్రియేట్ చేసి చూపించారు. 

 

ఇలా టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో రాజమౌళిని మించిన వారు లేరని అంటారు. ఒకప్పుడు ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ ఇలాంటి ప్రయోగాలు చేశారు... తర్వాత రాజమౌళి.  ఈయన చిత్రాల్లో గ్రాఫిక్ వ్యూజువల్స్ ఎంతో అద్భుతంగా ఉపయోగించుకుంటారు.  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి వ్యూజువల్ గానీ, ఫస్ట్ లుక్ గాని రాలేదు. నేడు ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ వదిలారు.

 

సోషల్ మీడియాలో ఈ మోషన్ పోస్టర్ అప్పుడే వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఇందులో ఎన్టీఆర్ నీటి నుంచి పరిగెత్తుకుంటు రావడం.. రామ్ చరణ్ నిప్పు నుంచి పరిగెత్తుకుంటూ రావడం.. వీరిద్దరూ కలసిన షేక్ హ్యాండ్.. చూస్తుంటు.. నీరూ నిప్పు కలిసినట్లు అనిపిస్తుంది.  ఈ లుక్ లో ఇద్దరూ పౌరుషంతో నీరూ నిప్పులా కలిసిపోతారని.. చెప్పినట్లు అనిపిస్తుంది.  కాగా, ఈ చిత్రంలో ఇద్దరూ మన్నెం వీరుల్లా కనిపించబోతున్నారని రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా,  ఎన్టీఆర్ తెలంగాణ మన్యం వీరుడు కొమురం భీమ్ గా కనిపించబోతున్నట్లు ఆ మద్య రాజమౌళి తెలిపారు.  మొత్తానికి ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: