ఇక మీదట సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడడానికి అలాగే సమాజంలో జరిగే మంచి చెడుల గురించి స్పందించడానికి నేను కూడా రేపటి నుండి సోషల్ మీడియా లో అందుబాటులో ఉంటానని  మెగా స్టార్ చిరంజీవి నిన్న ఒక వీడియో ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే నిన్ననే  చిరంజీవి ఇంస్టాగ్రామ్ అకౌంట్ కు అధికారిక గుర్తింపు(బ్లూ టిక్  మార్క్ ) రాగ నేడు ట్విట్టర్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్ అకౌంట్ కు కూడా అధికారిక గుర్తింపు లభించింది. 
 
ఇక ఈ రోజు ఉగాదికి కావడంతో తెలుగు ప్రజలందరికి పండగ శుభాకాంక్షలు తెలుపుతూ చిరు ట్విట్టర్ లో మొదటి పోస్ట్ చేశారు. ఆతరువాత లాక్ డౌన్ గురించి మరోపోస్ట్  చేయగా తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ గురించి  మరో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ అద్భుతంగా ఉందని పొగిడారు అయితే  ఒక్క విషయంలో మాత్రం అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిరు, ఆచార్య లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్డేట్ తో ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇస్తే అదిరిపోయేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియా ద్వారా చిరంజీవి అందుబాటులో ఉండడం తో ఇక నుండైనా  ఆచార్య కు సంబంధించి రెగ్యులర్ అప్డేడ్స్ వస్తాయని ఆశిస్తున్నారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: