'బేబీ డాల్' మరియు 'చిట్టియన్ కలైయ్యావే' పాటలతో పాపులర్ అయిన సింగర్ కనికా కపూర్. యూకే నుండి తిరిగి వచ్చిన కనికా విదేశాల నుంచి వచ్చిన వారు పద్నాలుగు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలన్న సూచనను పాటించకపోగా.., రాష్ట్రపతితో సహా ఎందరో పొలిటిషన్లు వీఐపీలు అటెండ్ అయిన ఒక పార్టీకి హాజరై పలువురి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో పాల్గొన్న తర్వాత ఆమె కరోనా వైరస్ బారిన పడి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో సంజయ గాంధీ మెడికల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది.

 

కరోనా పాజిటివ్ లక్షణాలతో సంజయ గాంధీ మెడికల్ ఆసుపత్రిలో చేరిన కనికా స్టార్ లా కాకుండా రోగిలా వ్యవహరించాలని చికిత్స చేసే వైద్యులు సూచించారంటే వారికి ఈ భామ ఎంతటి చుక్కలు చూపిస్తుందో అర్థమవుతుంది. ఈ విషయంపై సీరియస్ అయిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కనికా కపూర్ పై హత్యారోపణల కింద అరెస్ట్ చేయడానికి వెనుకడబోమని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె గురించి మళ్లీ ఒక వార్త బయటకి వచ్చింది.

 

ఐసోలాషన్ లో ఉన్న కనికాకు ఇంతకు ముందు రెండు సార్లు కరోనా టెస్ట్ చేయగా రెండు సార్లు పాజిటివ్ వచ్చింది. తాజాగా మరోసారి కోవిడ్-19 నిర్ధారణ టెస్ట్ చేయగా మళ్ళీ పాజిటివ్ వచ్చిందని హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది. ఆమె మరో రెండు సార్లు కోవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చే దాకా కనికాను డిశ్చార్జ్ చేయబోమని హాస్పిటల్ వారు ప్రకటించారు. ఇదిలా వుండగా ఆమెతో పాటు ఉండి కరోనా పాజిటివ్ లక్షణాలున్న ఆమె ఫ్రెండ్ కి మాత్రం టెస్టులో నెగిటివ్ వచ్చిందంట. అంతేకాకుండా ఆ పార్టీకి హాజరైన రాజకీయ నాయకులు, సెలెబ్రెటీలు మొదలైన వారందరిని ఐసోలేషన్ లో ఉంచగా అందరూ నెగటివ్ లక్షణాలతో బయటపడ్డారు. వైఏదేమైనా కనికా కపూర్ ని కరోనా వదిలిపెట్టడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: