కరోనా ఇప్పుడు దేశంలో ఎంతగా ప్రబలిపోతుందంటే.. చిన్నా పెద్ద.. సామాన్యులు, సెలబ్రెటీలు ఏవ్వరినీ వదలడం లేదు. తాజాగా సింగర్ కనికా కపూర్ కరోనా కు పాజిటీవ్ కేసు నమోదైన విసయం తెలిసిందే. ఆమె వల్ల కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు మరింత ఎక్కువయ్యే ప్రమాదం పెరిగింది. ఇప్పుడు ఆమె వల్ల నగరంలోనే కాదు, మొత్తం రాష్ట్రమంతటా కలకలం నెలకొంది. అంతే కాదు, కనికా కపూర్ ఇప్పుడు తనకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రికి కూడా పెద్ద తలనొప్పిగా మారారు. ఆమె ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఓ ప్రముఖ గాయనికి కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలలో తన ఫొటో (థంబ్ నెయిల్ ఫొటో) వినియోగించారని గాయని సునీత మండిపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం ఎంత ఘోరంగా ఉందో అందరికీ తెలిసిందే.
ఇటీవల లండన్ వెళ్లొచ్చిన ఆమె మూడు పార్టీల్లో పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ పార్టీలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. ఆమె మొత్తంగా 400 మందిని కలిసినట్టు తేలడంతో కలకలం రేగింది. కనికా కపూర్కు హాస్పిటల్లో అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, అయితే, ఆమె ఒక రోగిలా ఉండకుండా, స్టార్లా ప్రవర్తిస్తున్నారని ఎస్జీపీజీఐ ఆస్పత్రి తరఫున జారీ అయిన ఆ ప్రకటనలో వారు ఆరోపించారు.
సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న కనిక ఆ తర్వాత లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేరింది. ఆమెకు ఇప్పటికే నిర్వహించిన రెండు పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్గా తేలగా, తాజాగా మూడోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్గానే రిపోర్టులు వచ్చాయి. ఇదే విషయాన్ని వెల్లడించిన వైద్యులు మరో రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తామని, నెగటివ్ రిపోర్టులు వస్తేనే ఆమెను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.