టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఈ మద్య బాగా కలిసి వస్తుంది.  శ్రీమంతుడు సినిమా హిట్ తర్వాత వరుస విజయాలు అందుకుంటున్నాడు.  గత ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ మూవీతో మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రైతు సమస్యలపై వచ్చింది.. బీడువాడిన భూముల్లో సేద్యం చేసుకోలేక రైతుల వీక్ నెస్ ఆసరాగా చేసుకొని కార్పోరేటర్లు భూములను ఆక్రమించుకొని తమ ఇస్టానుసారంగా వ్యవహరించడంపై ఓ ఎన్ఆర్ఐ పోరాటం.. సేద్యం చేస్తే ఏ భూమిలో అయినా పాడిపంటలు పండించవొచ్చు అన్న కాన్సెప్ట్ తో మంచి విజయం అందుకుంది.

 

 ఈ మూవీ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు - రష్మిక జంటగా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ మరో సంచలన విజయం అందుకుంది.  ఈ మూవీ తర్వాత వంశి పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.. కానీ స్క్రిప్ట్ పరంగా నిరాశ చెందారట మహేష్ బాబు.  ఈ నేపథ్యంలో గీతాగోవిందం దర్శకుడితో ఓ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కరోనా ప్రభావంతో దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇండియా అంతా లాక్‌డౌన్‌లో ఉంది. నేటి (బుధవారం) నుంచి 21 రోజులపాటు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. 

 

 

సినిమా రంగం పై ఈ ప్రభావం స్పష్టం గా కనిపిస్తుంది. ఇప్పటికే షూటింగ్ లు సినిమా విడుదలలు అన్ని వాయిదా పడ్డాయి. ఇదిలా మహేష్ , పరశురామ్ సినిమా కూడా కరోనా కారణంగా వెనక్కి వెళ్లిపోయింది.  మహేష్ బాబు తో సినిమా అనగానే పరుశరామ్ ఛాలెంజ్ గా తీసుకున్నారు.. స్క్రిప్టు విషయంలో అంతే కసిగా పని చేశారని తెలిసింది.తాజా సమాచారం ప్రకారం.. ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. జూన్ ముహూర్తం ఫిక్స్ చేశారని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: