టాలీవుడ్ హీరోలు ఈ మధ్య మార్కెట్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో ఈ మధ్య స్టార్ హీరోలు అందరూ కూడా వసూళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం తో నిర్మాతలు కూడా చాలా విధాలుగా దర్శకుల మీద ఒత్తిడి తెచ్చి సినిమా కమర్షియల్ గా ఉండాలని చూస్తున్నారు. దర్శకులు కూడా సినిమా ఒక్కసారి కమర్షియల్ అయింది అంటే తమ దశ తిరిగిపోవడం ఖాయమని భావిస్తున్నారు. అందుకే అగ్ర హీరోలతో సినిమా అనగానే అది కమర్షియల్ గా ఉండే విధంగానే ఎక్కువగా ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి తోడు సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఉండాలి అనేది ప్లాన్. 

 

అందుకే ఇప్పుడు ఎక్కువగా అన్ని సినిమాలను దర్శకులు పాన్ ఇండియా వైడ్ గా విడుదల చెయ్యాలని చూస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా సినిమా విడుదల అయి అది మంచి వసూళ్లు సాధిస్తే మాత్రం ఇక హీరోలు ఒక్క సారిగా కమర్షియల్ స్టార్ లు అయిపోవడం ఖాయం. అందుకే దర్శకులు కూడా ఆ విధంగానే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల కోసం బాలీవుడ్ హీరోలను నమ్ముకుంటూ వస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా అందరూ అదే బాటలో ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

చిరంజీవి నటించిన సైరా సినిమాలో బాలీవుడ్ స్టార్ లు ఉన్నారు. ఆర్ఆర్ఆర్ లో కూడా బాలీవుడ్ స్టార్ హీరో ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో కూడా బాలీవుడ్ స్టార్ ని ఉంచే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీని మీద త్రివిక్రమ్ ఇప్పటికే కసరత్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. హీరోయిన్ లను కూడా వారినే ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నారు. అలా అయితే సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఆడుతుంది అనేది మన వాళ్ళ నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి: