అక్కినేని నట వారసుడు అఖిల్ ఇప్పటివరకు తీసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పటి వరకు అతను నటించిన చిత్రాల్లో అఖిల్ ప్రదర్శన నామమాత్రంగానే ఉండగా కేవలం తన అందంతో డ్యాన్సులు తోనే అతను అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టాడు. అయితే అఖిల్ ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. మిస్టర్ మజ్ను చిత్రం పరాజయం చవి చూసిన తర్వాత ఇప్పుడు కొత్తగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

 

అయితే చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉండగా కరోనా ప్రభావంతో అన్ని చిత్రాల లాగే పోస్ట్ పోన్ అయ్యింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తను అక్కినేని అభిమానులు అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం ఏమిటంటే చిత్రంలో అఖిల్ సరసన ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందుతున్న పూజా హెగ్డే నటిస్తూ ఉంది. 'అల వైకుంఠపురం లో' లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రం తర్వాత పూజ నటించిన చిత్రాల్లో మొదట విడుదలయ్యే చిత్రం కూడా ఇదే.

 

అయితే చిత్రానికి హీరోగా అఖిల్ తీసుకుంటున్న పారితోషికం కన్నా పూజా హెగ్డే హీరోయిన్ గా తీసుకుంటున్న పారితోషికం చాలా ఎక్కువ. నిర్మాతలు అఖిల్ కు చెల్లిస్తున్న దాని కన్నా రెట్టింపు మొత్తాన్ని పూజా హెగ్డే కు చెల్లిస్తున్నారు. లవ్ స్టోరీ కావడం తో పూజ ఎక్కువ రోజులు చిత్రానికి తన డేట్లు ఇవ్వవలసి వచ్చింది.. అంతే కాకుండా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ చొరవతో పూజ భారీ పారితోషికాన్ని కూడా అందుకుబోతుంది. ఎంతైనా హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అఖిల్ కు ఇది కొంచెం కష్టమైన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: