టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉన్న టాప్ హీరోలంతా ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఇలా మొదటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున స్టార్ట్ చేయడం జరిగింది. నటుడిగా మంచి క్రేజ్ ఉన్న టైంలోనే బిజినెస్ రంగంలో పెట్టుబడులు పెట్టిన నాగార్జున సక్సెస్ స్కూల్ బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారు. ఆ తరువాత కొంత మంది ఇండస్ట్రీలో ఉన్న హీరోలు నాగార్జున ని ఫాలో అవుతూ బిజినెస్ రంగంలోకి దిగారు. వాళ్ళలో కొంతమంది సక్సెస్ అవగా మరికొంతమంది చేతులెత్తేశారు. అయితే ప్రస్తుత తరంలో ఈ విధంగానే నాగార్జున ఫార్ములా అనుసరిస్తున్నది….సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపార రంగంలో దూసుకుపోతున్న ఈ ముగ్గురు కెరియర్ పరంగా మంచి స్థానంలో ఉన్నారు.

 

అంతేకాకుండా ఫ్రెండ్షిప్ పరంగా ఈ ముగ్గురు చాలా క్లోజ్. అయితే ఇటీవల ఒక పక్క సినిమాలు చేసే వ్యాపారంలో కూడా ముగ్గురు ఒకేలా ఆలోచిస్తున్నారట. వీరి మేనేజర్ల ద్వారా ఫైనాన్సిల్ విషయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు మరియు వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. మరోపక్క రామ్ చరణ్ కూడా తనకంటూ సొంత బ్యానర్ ఉండాలని కొణిదెల ప్రొడక్షన్ హౌస్ అనే బ్యానర్ స్టార్ట్ చేసి...తండ్రి చిరంజీవి సినిమాలను నిర్మిస్తున్నాడు. తాజాగా వీరిద్దరితో పాటు ఎన్టీఆర్ కూడా సొంత బ్యానర్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

 

ఇప్పటిదాకా సొంత బ్యానర్ అంటే నందమూరి కళ్యాణ్ రామ్ బ్యానర్ పేరు చెబుతారు. ఇటువంటి తరుణంలో దివంగత తండ్రి హరికృష్ణ పేరిట నిర్మాణ సంస్థ స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుండగా మొన్నటి దాకా ప్రొడక్షన్ హౌసెస్ మీద ఉన్న వీళ్ల దృష్టి ఇప్పుడు థియేటర్ల మేనేజ్మెంట్ మీద పడిందట.  ఈ ముగ్గురు ఒకే మాట మీద పడి థియేటర్ల మేనేజ్మెంట్ పై దృష్టి పెడితే కనుక ఇండస్ట్రీ మొత్తం వేల చేతుల్లోకి వీళ్ళ చేతుల్లోకి వెళ్లిపోవటం గ్యారెంటీ అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: