కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఇళ్లు దాటి ప్రజలు బయటకు రాకుండా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. వైరస్ నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వ హెచ్చరికలు ఉల్లంఘించిన వారిపై కేసులు కూడా నమోదు చేసి జైలుకి పంపిస్తున్నారు. సెలెబ్రెటీలు గడప దాటకుండా ఇళ్లలో కూర్చొని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా సూచనలను ఇస్తున్నారు. తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కొంతమంది సెలబ్రిటీలు ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ కూడా ఒక వీడియో పోస్ట్ చేసాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ చీపురు పట్టాడు. లాక్ డౌన్‌తో ఇంటికి పరిమితమైన వెన్నెల కిశోర్ తన ఇంట్లో ఈ పనిచేస్తున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. చీపురు పట్టి చక చక ఇళ్లంతా క్లీన్ చేసేశాడు. ఈ పోస్ట్ పై ఆయన అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అన్నా ఇంకా చాలా చోట్ల దుమ్ము ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. టేబుల్ కింద, టీవీపైన దుమ్మును క్లీన్ చేయాలని రిప్లై ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, వెన్నెల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కిషోర్. అప్పట్నుంచి అతని పేరు వెన్నెల కిషోర్‌గా మారిపోయింది. 

 

వెన్నెల చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ అనతి కాలంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఉన్న హాస్య నటులలో చేతి నిండా సినిమాలతో ఏడాది మొత్తం ఫుల్ బిజీగా ఉండే ఏకైక నటుడు వెన్నెల కిషోర్. విడుదలయ్యే ప్రతీ సినిమాలోనూ ఆయనకు ఒక పాత్ర ఉండేలా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.  డైరెక్టరుగా కూడా మారిన వెన్నెల కిషోర్ అక్కడ మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: