కరోనా దెబ్బకి ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. ఎక్కడి షూటింగ్ లు అక్కడ ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయాయి. ఇక ప్రపంచం మొత్తం క్రేజీగా ఫీలయ్యే చిత్రం... ఆచిత్రం ఎప్పుడు విడుదలవుద్దా అని చూసే చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఆర్ ఆర్ ఆర్ష. ఈ చిత్రం పై సినీ ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అందులోనూ రాజమౌళి చిత్రమంటే ఆ హైపే వేరు కదా.
ఇద్దరు టాప్స్టార్స్ కలిసి నటిస్తున్న చిత్రమిది. రాంచరణ్ - ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా గురించి ఒక్కో విషయాన్నీ బయటపెడుతున్నారు దర్శకనిర్మాతలు. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ నిలిచిపోయిన ఈ సినిమా మోషన్ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రేక్షకులను 'ఆర్ ఆర్ ఆర్' మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఈ సంవత్సరం జులై 30న రిలీజ్ కావాల్సిన ఆర్.ఆర్.ఆర్ సినిమాను కొన్ని నెలల క్రితమే వచ్చే ఏడాది జనవరిన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఆ సూచనలు కనపడటం లేదు అని ప్రేక్షకులంతా భావిస్తున్నారు. ఆ షూటింగ్ ముగిద్దాం అనుకుంటున్న టైంలో కరోనా వైరస్ ప్రబలడంతో షూటింగ్ నిలిపేశారు. కానీ చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే దిశగా ప్లాన్ చేస్తున్నారట. కరోనా ఎఫెక్ట్ తో మళ్లీ సినిమా విడుదల వాయిదా పడుతుంది అనుకున్నారంతా.. కానీ మోషన్ పోస్టర్ లో మాత్రం యధావిధిగానే 2021జనవరి 8న విడుదల చేయనున్నట్లు స్పష్టంగా తెలిపారు. మరో విషయం ఏమిటంటే.. ఈ సినిమా నుండి అలియా భట్ తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. అది నిజం కాదని తెలియజేస్తూ పోస్టర్ లో అలియా పేరును చేర్చారు. అంటే అలియా కూడా సినిమాలో ఉన్నట్లు అర్థం అవుతుంది. అయితే ఇక్కడ అసలు మెలికంతా రాజమౌళి పెట్టినట్లు విలన్ అజయ్ దేవగన్ లేకపోతే ఈ ఇద్దరి హీరోల్లో ఎవరో ఒకరిని విలన్గా చూపిస్తారా అన్నది మాత్రం కొంత సస్పెన్స్ లో ఉంచాడు రాజమౌళి.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: ttps://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple