ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్టులో పూజ హెగ్డే అగ్ర స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ టైమ్స్ సర్వేలో పూజ హెగ్డే కు సమంతతో పోల్చుకుంటే పాపులారిటీ ర్యాంకింగ్స్ లో తక్కువ స్థానం వచ్చినా పారితోషిక విషయంలో పూజ హెగ్డే పారితోషికం సమంత స్థాయిని దాటిపోవడానికి అఖిల్ పరోక్షంగా కారకుడు అంటూ ప్రచారం జరుగుతోంది. 

 

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మూవీ హీరోయిన్ ఎంపిక విషయంలో పూజ హెగ్డే ను ఒప్పించడానికి ఆమూవీ నిర్మాతలు చాలపాట్లు పడవలసి వచ్చింది అని అంటున్నారు. ఇప్పటికే టాప్ యంగ్ హీరోల పక్కన నెంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయిన పూజ అఖిల్ తో నటించడానికి ఏమాత్రం ఆసక్తి క్నపరచలేదు అని అంటారు. 

 

దీనితో ఈమూవీలో పూజ హెగ్డే ను నటింప చేయడానికి 2.5 కోట్లు ఆఫర్ చేయవలసి వచ్చింది అని అంటున్నారు. వాస్తవానికి ఈ మూవీలో నటించన అఖిల్ కు కూడ ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వలేదని దీనితో అఖిల్ పుణ్యమా అని ఆమె టాప్ పెయిడ్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది అంటూ ప్రచారం జరుగుతోంది. 

 

దీనికితోడు ‘అల వైకుంఠపురములో’ మ్యానియాతో అనేక బ్రాండ్స్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమెకు కోట్లల్లో ఆఫర్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటి వరకు ఒక టాప్ హీరో ప్రమోట్ చేసిన ఒక సెల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఆ టాప్ హీరో స్థానంలో పూజ ఎంపిక కావడమే కాకుండా ఆమెకు ఆ హీరోకు ఇచ్చిన పారితోషికం కంటే ఎక్కువగా ఆఫర్ చేసారు అని వస్తున్న వార్తలు టాప్ పెయిడ్ హీరోయిన్ గా పూజ మ్యానియా ఎలా కొనసాగుతోందో అర్ధం అయ్యేలా చేస్తోంది. దీనితో అఖిల్ పూజ హెగ్డే పై పెంచుకున్న మ్యానియా ఆమెకు ఎలా అదృష్టంగా మారిందో అర్ధం అవుతుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: