కరోనా వల్ల ఇప్పుడు దేశం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రజలు అంతా ఇంటికే పరిమితం అవుతున్నారు.  కరోనాను కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించి ఇంటిపట్టున ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు ఇంటిపట్టున ఉంటున్న విషయం తెలిసిందే. షూటింగ్స్ క్యాన్సల్ అయ్యాయి.. రిలీజ్ కావాల్సిన చిత్రాలు వాయిదా వేసుకుంటున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  నటుడు, నిర్మాత, దర్శకుడు రాకేష్ రోషన్ తనయుడుగా కహోనా ప్యార్ హై చిత్రంతో హీరోగా పరిచయం అయిన హృతిక్ రోషన్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.  

 

హృతిక్ రోషన్.. సుసానే ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తదెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2014 లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.  విడాకులు తీసుకున్నప్పటికీ వీరిద్దరు స్నేహం కొనసాగుతుంది.  ప్రస్తుతం దేశంలో కరోనా ప్రబలిపోతున్న సంగతి తెలిసిందే.  తాజాగా, ఈ జంటను కరోనా వైరస్ ఒకటి చేసింది. దేశమంతా 21 రోజుల పాటు లాక్ డౌన్ అయిన నేపథ్యంలో పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని హృతిక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.  

 

ఇప్పుడు అంతా ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. తమ పిల్లలు హ్రేహాన్, హృదాలతో కలసి ఉండేందుకు సుసానే తన ఇంటికి వచ్చిందని హృతిక్ తెలిపాడు. ఈ 21 రోజులు తామంతా కలిసే ఉంటామని చెప్పారు. సుసానే గత కొద్ది రోజులుగా తమ ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటోందని తెలిపాడు. పిల్లల పట్ల ఆమెకు ఎంత ప్రేమ ఉందో ఇదే నిదర్శనమని చెప్పాడు. తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేస్తూ నీవు తీసుకున్న నిర్ణయానికి థ్యాంక్స్ సుసానే అని చెప్పాడు. మొత్తానికి కరోనా వైరస్ వల్ల కష్టాలు పడుతున్న వారు ఏమో కానీ.. ఇంటిపట్టున ఉంటూ తమ ఐనవారితో చాలా కాలం తర్వాత ప్రశాంతంగా గడుపుతున్నారు సెలబ్రెటీలు.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: