మన టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని నటులు మెగాస్టార్ చిరంజీవి, నటప్రపూర్ణ మోహన్ బాబుల గురించి మన తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ఇద్దరూ కూడా ఎవరికి వారు తమ అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుని, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఒక ముఖ్య విషయం ఏమిటంటే అటు మెగాస్టార్ అయినా, ఇటు మోహన్ బాబు అయినా, ఇద్దరూ కూడా మొదట్లో అక్కడక్కడా కొన్ని విలన్ పాత్రల్లో నటించి మంచి పేరు దక్కించుకుని ఆపై హీరోలుగా మారి పలు సంచలన విజయాలు అందుకున్నవారే. 

 

అయితే ఈ ఇద్దరికీ బయట పెద్దగా సరిపడదని, వారి మధ్య కొన్ని విబేధాలు ఉన్నాయని కొన్నేళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే అదంతా ఒట్టిదే అని అనడానికి ఇప్పటికే కొన్ని ఫంక్షన్లు, వేడుకల్లో ఈ ఇద్దరూ కలిసి ఎంతో సరదాగా గడపడంతో పాటు ఒకరి కుటుంబ వేడుకలకు మరొకరు హాజరై ఎంతో ఆప్యాయంగా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా కొందరు గిట్టని వారు చేసిన తప్పుడు ప్రచారం అని, మొదటి నుండి మెగాస్టార్ కు మోహన్ బాబుకు మంచి అనుబంధం ఉందని ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులు సైతం చెప్పడం జరిగింది. 

 

ఇక ఇటీవల ఒక వేదికపై మోహన్ బాబును సరదాగా ముద్దాడిన మెగాస్టార్, తమ ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి తెలుసునని, కాబట్టి ప్రచారం అవుతున్న పుకార్లను తాము పెద్దగా పట్టించుకోమని చెప్పారు. మరోవైపు మోహన్ బాబు కూడా మెగాస్టార్ తో తనకు గల మంచి సన్నిహిత్యంపై పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. ఇకపోతే నిన్న ఉగాది పండుగ సందర్భంగా సోషల్ మీడియా మాధ్యమాల్లోకి ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ పై ఇప్పటికే పలువురు ఫ్యాన్స్, తో పాటు సినిమా ప్రముఖులు కూడా అభినందనలు తెల్పుతుండగా మోహన్ బాబు కూడా నిన్న ఒక ట్వీట్ చేసారు. ట్విట్టర్ లోకి వెల్కమ్ మిత్రమా అంటూ మోహన్ బాబు చేసిన ట్వీట్ ని, థాంక్యూ మిత్రమా, రాననుకున్నావా రాలేననుకున్నావా అంటూ సరదాగా మెగాస్టార్ దానిని రీట్వీట్ చేయడం జరిగింది. ఇక మెగాస్టార్ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: