టాలీవుడ్ లో అల్లు అర్జున్ తో రేసు గుర్రం, రవితేజతో కిక్ , రామ్ చరణ్ తో ధృవ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు సురేందర్ రెడ్డి. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవితో భారీ బడ్జెట్ మూవీగా ‘సైరా నరసింహారెడ్డి’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంతో ఈ మూవీ తెరకెక్కించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్ మాత్రం పెద్దగా రాలేదు. దాంతో సురేందర్ రెడ్డి ఇబ్బందుల్లో పడ్డట్టు వార్తలు వచ్చాయి.
రిజల్ట్ ఎలా ఉన్నా... సురేందర్ రెడ్డి భారీ చారిత్రక సనిమాలు సైతం సమర్థవంతంగా తెరకెక్కించగలడు అనే విషయాన్ని 'సైరా' నిరూపించింది. కథ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాని సురేందర్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెెలుస్తుంది. ఆ తరువాత ఏ హీరోతో వీలైతే ఆ హీరోతో సెట్స్ పైకి వెళ్లే ఉద్దేశంతో ఆయన అల్లు అర్జున్, మహేశ్ బాబు, ప్రభాస్ కోసం కథలను రెడీ చేసుకుని రంగంలోకి దిగాడు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ కి ఆయన కథ వినిపించడం జరిగిపోయిందని అంటున్నారు.
గతంలో 'రేసు గుర్రం' వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కావడం వలన, అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు, ప్రభాస్ ని లైన్లో పెడుతున్నట్లు టాలీవుడ్ సమాచారం. గతంలో మహేశ్ తో 'అతిథి' చేశాడు. కాకపోతే ఈ మూవీ అప్పట్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మహేష్ కథ విషయంలో మెచ్చుకోవాలి.. ఈ నేపథ్యంలో ప్రభాస్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా చెబుతున్నారు. ప్రభాస్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ పట్ల అభిమానులు కూడా ఆసక్తితో వున్నారు. krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ డైరెక్షన్ లో ఓ మూవీలో నటిస్తున్నాడు ప్రభాస్.