టాలీవుడ్ లో ఇప్పుడు ఏ సినిమా చేసినా అది కమర్షియల్ గా ఉండాలి అని నిర్మాత దర్శకుడు హీరో ఇతర నటులు కూడా ఆలోచించటం ఆందోళన కలిగించే అంశం. సినిమా కథ ఎలా ఉన్నా సరే అది కమర్షియల్ గా ఉండాలి. కమర్షియల్ గా హిట్ అవ్వాలి అని భావిస్తూ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ఆడించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఆ సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ హంగులతో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

 

 నిర్మాతలు హీరోలు అందరూ కూడా సినిమా లో వంద కోట్ల వసూళ్లు ఉండే విధంగా ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వారి బాటలోనే హీరోయిన్ లు కూడా నడవడం ఆందోళన కలిగించే అంశం. వారు సినిమా కమర్షియల్ గా ఉండే విధంగా అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పూజ హెగ్డే, రష్మిక మందన వంటి హీరోయిన్ లు సినిమా కమర్షియల్ గా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరో పక్కన కమర్షియల్ సినిమా చేస్తే తమ దశ తిరుగుతుందని భావిస్తున్నారు హీరోయిన్ లు. దీనితోనే ఎక్కువగా కమర్షియల్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. 

 

నిర్మాతలు కూడా హీరోయిన్ లు ఇలాగే తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కమర్షియల్ హీరోయిన్ అయితే చాలు భారీ పారితోషికం వస్తుంది అని భావిస్తున్నారు. హీరోయిన్ కూడా కమర్షియల్ గా ఉంటే భారీ వసూళ్లు సాధించవచ్చు అనేది హీరోలు దర్శకులు నిర్మాతల నమ్మకం. దీనిని హీరోయిన్ లు కూడా క్యాష్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కమర్షియల్ హవా ఎక్కువగా నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలందరూ కూడా కమర్షియల్ సినిమాలను నమ్ముకున్నారు. వసూళ్లను ఎక్కువగా నమ్ముకుని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: