మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. చిరు పలు సోషల్ మీడియా ఖాతాల్లోకి అలా ఎంట్రీ ఇచ్చాడో లేదో ఆయనకు వెంటనే లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు. చిరు అలా ఎంట్రీ ఇచ్చారో లేదో వెంటనే ఆయనకు లక్షల్లో స్వాగతాలు వచ్చేశాయి. కేవలం 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో ఫాలోవర్స్ వచ్చారు. ఆయన ముందుగా తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెపుతూ తన మెసేజ్ పోస్ట్ చేశారు. ఇక చిరు తన ఇన్స్టాగ్రామ్లో తల్లితో దిగిన ఫొటోను మొదట పోస్ట్ చేశారు. చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 4.5 లక్షలకు చేరువగా ఉంది.
అంటే దీనిని బట్టి చిరు రేంజ్, క్రేజ్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చిరుకు ఎంతో మంది స్టార్ హీరోలు వెల్కమ్ చెపుతూ స్వాగతం పలికారు. నాగార్జున - మహేష్ బాబు - మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు చిరంజీవి మెసేజ్ ని కోట్ చేస్తూ స్వాగతం పలికారు. అయితే మెగా ఫ్యామిలీ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ మాత్రం దీనిపై స్పందించక పోవడం ఇప్పుడు అన్నింటా చర్చనీయాంశ మైంది. బన్నీ తీరుపై మోగా ఫ్యామిలీ అభిమానులు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇక బన్నీకి మెగా ఫ్యామిలీతోనూ.. ఫ్యాన్స్తోనూ పొసగడం లేదని కూడా అంటున్నారు.
ఇక కొద్ది రోజులుగా బన్నీ మెగా ఫ్యామిలీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నాడన్న టాక్ ఉంది. ఫంక్షన్లలో గతంలో చిరు భజన చేసే బన్నీ ఇటీవల ముందుగా తన తండ్రి పేరు ప్రస్తావిస్తున్నాడన్న అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను కెలుక్కోవడం... సైరా నరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు బన్నీ స్పందించకపోవడం లాంటి అంశాలతో పాటు బన్నీ మెగా క్రేజ్తో సంబంధం లేకుండా తనకంటూ తన ఓన్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడన్న టాక్ ఉంది. ఇక ఇప్పుడు కరోనా వల్ల షూటింగ్లు లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నా కనీసం స్పందించకపోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది.