టాలీవుడ్ లో ఇప్పుడు నిర్మాత లు కమర్షియల్ అడుగులు వేస్తున్నారు. సినిమా చేస్తే భారీ బడ్జెట్ సినిమా చేయాలి. ఆ సినిమా భారీ విజయం సాధించాలి. వసూళ్లు ఎలా చూసుకున్నా సరే వంద కోట్ల కు పైగానే ఉండాలి. అలా అయితే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ నిర్మాత లు సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే అగ్ర నిర్మాతలు అందరూ స్టార్ హీరోలు చుట్టూ తిరుగుతూ సినిమాలు చేయాలని పట్టుదలగా ఉన్నారు.

 

 నాలుగు రోజులు ఆలస్యం అయినా పర్వాలేదు కానీ సినిమా మాత్రం చేస్తే స్టార్ హీరో తో చేయాలి. లేకపోతే మానేయాలి అన్న విధంగా ఇప్పుడు నిర్మాతలు వ్యవహార శైలి ఉంది. ఇప్పుడు ఇదే స్టార్ హీరోలకు చిరాకుగా మారినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు సినిమాలు ప్లాప్ అయితే చాలు ఇక ఆ నిర్మాత స్టార్ హీరో వైపు చూడటానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని సమాచారం. వీరితో సినిమాలు చేయాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు నిర్మాతలు. 

 

మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అది ఫ్లాప్ అయిందో లేదో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం దానికి సంబంధించిన అనవసర ప్రచారం అంతా జరిగింది. ఇక బాలకృష్ణ కూడా గత మూడు సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ కొట్టలేకపోయారు. దీంతో ఇప్పుడు ఆయనను కూడా నిర్మాతలు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. చిరంజీవి సైరా సినిమా ఫ్లాప్ కావడంతో ఈయనతో సినిమా చేయడానికి కొందరు నిర్మాతలు ముందుకు రావడం లేదని, అందుకే రాం చరణ్ తన తండ్రి హీరోగా సినిమాలు నిర్మిస్తున్నారు అని అంటున్నారు. చిన్న హీరోల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. వాళ్ళను ఎవరూ పట్టించుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: