పూజా హెగ్డే.. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్లో ఒకరిగా దూసుకుపోతోంది. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటి.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ భామ మొదట్లో ఆఫర్ల కోసం సతమతమైనా.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల చెంత చేరింది. ఇక ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన ఇప్పటికే నటించేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్గా నిలిచిన పూజా హెగ్డే ఇటీవల బన్నీ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురంలో చిత్రంతో సూపర్ హిట్ కొట్టింది.
ఓ విధంగా చెప్పాలంటే ఈ చిత్రం పూజా కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఈ చిత్రంతో పూజా క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఒక్కో సినిమా కోసం దాదాపు 2 కోట్లకు పైగానే తీసుకుంటుంది పూజా హెగ్డే. ఇక ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 20వ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. మరోవైపు అఖిల్ హీరోగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు టాలీవుడ్లోనే కాకుండా ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ దర్శకుడు ఫర్హాదా సంజీ తెరెకెక్కిస్తున్న `కభి ఈద్ కభి దివాళి` చిత్రంలో సల్మాన్ సరసన నటించేందుకు పూజా ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం దాదాపు 4 కోట్ల వరకు పారితోషికం కూడా తీసుకుంటుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి పూజా హెగ్డే ఆశలపై నీళ్లు జల్లింది. కరోనా దెబ్బకు ఈమె నటిస్తున్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, ప్రభాస్ సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ రెండు సినిమాలకు కొత్త డేట్స్ ఇచ్చి తర్వాత సల్మాన్ దగ్గరికి వెళ్లాలి. అయితే అప్పటికే ఈ చిత్రం కూడా మొదలు కానుంది. దాంతో పూజాను నమ్ముకుంటే పని కాదని సల్మాన్ మరో హీరోయిన్ కోసం మొగ్గు చూపుతున్నారట. ఏదేమైనా కరోనా ఎఫెక్ట్తో పూజా హెగ్డేకు దిమ్మ తిరిగే షాక్ తగిలిందన్నమాట.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google:https://tinyurl.com/NIHWNgoogle
apple :https://tinyurl.com/NIHWNapple