ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై అన్ని దేశాలు కూడా గట్టిగా యుద్ధాన్ని ప్రకటించాయి. ముందుగా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా లాకౌట్ ప్రకటించిన పలు దేశాలు, ఎవ్వరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, అలానే ఎవరికి వారు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే త్వరితగతిన ఈ వ్యాధిని అరికట్టగలం అని నిర్ణయించాయి. అయితే దీనివలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది, దానితో ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

 

అయితే వారిని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. అయితే తమ వంతుగా ప్రభుత్వాలకు మేము కూడా సాయం అందిస్తామని తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ హీరో నితిన్, యువ హీరో మంచు మనోజ్, యాంగ్రీ హీరో రాజశేఖర్, కామెడీ హీరో అల్లరి నరేష్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, వివి వినాయక్, అనిల్ రావిపూడి వంటి వారు ముందుకు వచ్చి తమ వంతుగా విరాళాలు అందించడం జరిగింది. 

 

ఇక కాసేపటి క్రితం బాహుబలి ప్రభాస్ తనవంతుగా ప్రజలకు చేయూత నివ్వటానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించడం జరిగింది. ఇటువంటి కష్ట పరిస్థితుల్లో ప్రజలను తనవంతుగా ఆదుకోవడం తన బాధ్యత అని, మిగతా వారు కూడా తమ స్తోమత మేరకు ప్రజలకు చేయూతను అందించాలని, అలానే ఇటువంటి పరిస్థితుల్లో ఎవరూ కూడా బయటకు రాకుండా ఇళ్లవద్దనే ఉండి ప్రభుత్వానికి సహకటించాలని ప్రభాస్ కోరారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: