సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సీజన్ లో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాతో పోటీ పడి కూడా మంచి కమర్షియల్ సక్సస్ ని సాధించింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మేజర్ గా అదరగొట్టారు. అంతేకాదు మాస్ లుక్ లోను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడ్రు. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే సూపర్ స్టార్ సినిమా సెట్స్ మీదకి వెళుతుందనుకున్నారు. అంతేకాదు దసరా సందర్భంగా రిలీజ్ కూడా అవుతుందనుకున్నారు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు. కాని వంశీ పైడిపల్లి తో ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో సూపర్ స్టార్ సినిమా ఇప్పట్లో లేదని తెలుస్తోంది.

 

అయితే మే నుంచి ఎఫ్ 3 లో నటిస్తారని సమాచారం. సరిలేరు ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎఫ్ 2 కి సీక్వెల్ గా రూపొందనుందన్న సంగతి తెలిసందే. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన కెరీర్లో 27వ సినిమాగా తెరకెక్కబోతున్న సినిమాకి గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా త్వరలో మహేష్ బాబు పరశురామ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందట. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీగా నిర్మించబోతున్నారు.

 

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నట్టు తాజా సమాచారం. మహానటి తర్వాత పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఇక తాజాగా మహేష్ తో రూపొందబోయో సినిమాకి కీర్తి సురేష్ అయితే బాగుంటుందని పరుశురామ్ భావిస్తున్నాడట. కాని వాస్తవంగా కియారా అద్వాని పేరు కూడా వినిపిస్తుంది.

 

ఇప్పటికే కియారా మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చలరేగిపోతుంది. అందుకే ఆ క్రేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని ఈ సినిమాకి కియారా ని అనుకుంటున్నారట. మరి ఈ ఇద్దరిలో ఎవరు మహేష్ పక్కన నటించడానికి ఫైనల్ అవుతారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: