టాలీవుడ్ స్వీటి అందాల అనుష్క శెట్టి... సినీ ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. పూరి జగన్నాధ్ అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ఇక గ్రాఫిక్స్ చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి సినిమాతో అనుష్క స్టార్ డం మొత్తం అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. 

 

అంతేకాదు హీరోయిన్ గా ఎలాంటి ప్రయోగానికి అయినా అసలు ఆలోచించకుండా ముందుంటుంది. నిజంగా ఒక స్టార్ హీరో కూడా ఇలాంటి సాహసం చేయరని చెప్పాలి. సైజ్ జీరో వంటి సినిమా కి ఒకే చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఇక అనుష్క బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చింది.  బాహుబలి తో వచ్చిన క్రేజ్ తో సెలెక్టెడ్ సినిమాలనే చేస్తుంది. అంతేకాదు బాహుబలి తర్వాత భాగమతి చేసింది. అయితే హీరోతో సినిమా చేయలేదు. ఇక ఇప్పుడు రిలీజ్ కి రెడిగా ఉన్న నిశ్శబ్దం సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ కావడంతో అనుష్క ఫ్యాన్స్ కి హీరో సరసన సినిమా చేస్తే చూసి ఎంజాయ్  చేయాలని ఆసక్తికరంగా ఉన్నారు.

 

అయితే తాజా సమాచారం ఏమిటంటే స్వీటి అనుష్క త్వరలో ఒక స్టార్ హీరో తో కలిసి రొమాన్స్ చేయబోతుందట. అది కూడా తమిళ సినిమా అని సమాచారం. ఇక ఇన్నేళ్లకు అనుష్క అజిత్ హీరోగా.. 'ఎంతవారుగాని' సినిమాను రూపొందించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలో అనుష్క నటిస్తుందని తాజాగా అందిన కోలీవుడ్ మీడియా సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. అయితే ఇది కేవలం రూమరే అన్న మాట వినిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ లో ఇదొకటి అని తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో నిలిచిపోయిన సినిమాల పరిస్థితే ఏంటో అర్థం కాని నేపథ్యంలో ఇలా అనుష్క తాజా చిత్రం అంటూ వచ్చిన న్యూస్ కంప్లీట్ గా ఫేక్ అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: