కోలీవుడ్ హీరో హార్ట్ ఎటాక్ తో మరణించడం తమిళ సిని పరిశ్రమను షాక్ అయ్యేలా చేసింది. ఒక పక్క కరోనా వైరస్ వల్ల హోమ్ క్వారెంటైన్ లో ఉన్న సెలబ్రిటీస్ కు తమిళ హీరో మరణవార్త శోక సముద్రంలో ముంచెత్తుతుంది. డాక్టర్ గా ఉన్న సేతురామన్ 2013లో కోలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. స్వతహాగా చర్మ వ్యాధి నిపుణుడు అయినా సేతు రామన్ సినిమాల మీద తనకున్న ఇంట్రెస్ట్ తో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. కన్నా లడ్డు తిన్న ఆసియ్యా సినిమాతో తెరంగేట్రం చేసిన సేతు వాలిబ రాజా, సక్కా పోదు పోదు రాజా, 50/50 సినిమాల్లో నటించారు.
గురువారం రాత్రి 8:45 గంటలకు హార్ట్ ఎటాక్ రావడంతో కనీసం ట్రీట్ మెంట్ చేయించుకునే అవకాశం లేకుండానే తుది శ్వాస విడిచారు సేతు రామన్. ఈ హీరో మరణ వార్త విన్న ఖుష్బూ సుందర్, ఐశ్వర్య రాజేష్, అభిరామి వెంకటాచలం షాక్ కు గురయ్యారని తెలుస్తుంది. ఖుష్బూ మాత్రం సేతు మరణంపై దేవుడిని నిందిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. డాక్టర్ వృత్తిలో ఉంటున్నా హార్ట్ ఎటాక్ రావడంతో సేతు రామన్ అనంతలోకాలకు వెళ్లారు.
ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా సేతు కొన్ని సూచలను చెబుతూ వీడియో పెట్టారు. అలాంటి అతను ఈరోజు మరణించడంపై కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ లో ఉంది. డాక్టర్ గా పనిచేస్తున్నా సినిమాల్లో నటించాలనే కోరికతో ఎంట్రీ ఇచ్చిన సేతు కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేయగలిగారు. ప్రజల ఆరోగ్యంతో పాటుగా తన ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా టైం కేటాయించి ఉంటే బాగుండేదని అంటున్నారు. అయితే వచ్చింది హార్ట్ ఎటాక్ దానికి ఎవరు ఏం చేయలేరు. సేతు మరణ వార్త విని కోలీవుడ్ స్టార్స్ సేతు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
https://tinyurl.com/NIHWNgoogle