నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా జెర్సీ. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నానికి జోడిగా సాండల్ వుడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. తెలుగులో ఈ సినిమా మంచి విజయం సాధించటంతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇటీవల అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్ హీరో షాహిద్ కపూర్. ఈ హీరో తోనే జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రీమేక్ కు ఒరిజినల్ వర్షన్ ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైది. తెలుగులో శ్రద్ధా శ్రీనాద్ నటించిన పాత్రను హిందీలో మృణాల్ ఠాకూర్ పోషిస్తుంది. అయితే ముందుగా ఈ పాత్రకు సౌత్ బ్యూటీ రష్మిక మందన్నను సంప్రదించారు. కానీ రష్మిక ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేయటంతో మృణాలు తీసుకున్నారు చిత్రయూనిట్.
అయితే జెర్సీకి నో చెప్పటంపై ఇటీవల రష్మిక స్పందించింది. `నేను ఎక్కువగా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తున్నా.. అలాంటి సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నా. అందుకే జెర్సీ రీమేక్కు నో చెప్పా. అలా అని జెర్సీ మంచి సినిమా కాదని చెప్పటం లేదు. అది రియలిస్టిక్ సినిమా. అలాంటి పాత్రలు ఇప్పట్లో నేను చేయాలనుకోవటం లేదు. అందుకే జెర్సీ రీమేక్ కు నో చెప్పా` అంటూ కామెంట్ చేసింది రష్మికా మందన్నా. ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్, సుకుమార్ ల సినిమాతో పాటు కన్నడలో పొగరు, తమిళ్ లో సుల్తాన్ సినిమా లో నటిస్తుంది.