ఛలో సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం స్తార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉండడంతో ఆ స్థానాన్ని పూజాహెగ్డే, రష్మిక సంపాదించుకున్నారు. వీరిద్దరి మధ్య ఇప్పుడూ గట్టి పోటీ నెలకొంది. రష్మిక చేసిన అన్ని సినిమాలు హిట్ అవుతుండడంతో ఆమెకి వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి.

 

మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన నటించింది. అలాగే అలవైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ చిత్ర తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాలో హిరోయిన్ గా రష్మిక సెలెక్ట్ అయింది. అందం, అభినయం రెండూ కలవడంతో ఆమెని వెతుక్కుంటూ ఆఫర్లు వస్తున్నాయి. కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగులోకి వచ్చిన ఈ భామ హిందీలో వచ్చే మంచి అవకాశాన్ని కోల్పోయింది.

 


ఈ మధ్య తెలుగు సినిమాలకి హిందీలో మంచి గిరాకీ ఏర్పడింది. బాలీవుడ్ నిర్మాతలు తెలుగు సినిమాల మీద ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలని హిందీలో రీమేక్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి రెడీగా ఉన్నారు. కబీర్ సింగ్, టెంపర్ మొదలగు చిత్రాలన్ని అక్కద మంచి విజయం సాధించాయి. అయితే ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న జెర్సీ సినిమా హిందీలో రీమేక్ కి వెళ్ళింది.

 


షాహిద్ కపూర్ ఈ సినిమాలో హీరోగా కనిపిస్తున్నాడు. తెలుగులో నాని హీరోగా నటించిన ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా హిందీ రీమేక్ లో రష్మికని అడిగారట. కానీ రష్మిక ఒప్పుకోలేదు. దానికి గల కారణాలని రష్మిక వివరించింది. జెర్సీ రియలిస్టిక్ చిత్రం.. ప్రస్తుతం నేను అన్ని కమర్షియల్ చిత్రాలనే ఎంచుకుంటున్నాను. అందుకే జెర్సీ సినిమా ఒప్పుకోలేదని తేల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: