కరోనా వైరస్ నేపథ్యంలో 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్‌లోకి వెళ్లింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి, అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలు తమకు లభించిన సమాయాన్ని గృహ నిర్బంధంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయాడు. ముంబైకి సమీపంలోని పాన్వెల్ ఫాంహౌస్‌లో కుటుంబ సభ్యులతో సేద తీరుతున్నాడు. తన వెంట సోదరి అర్పితా శర్మ, బావ ఆయుష్ శర్మ‌తోపాటు వారి పిల్లలు కూడా ఉన్నారు. అయితే షాకింగ్‌గా ఫాంహౌస్‌లో బాలీవుడ్ తార జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో కనిపించడం అభిమానులకు షాక్ గురి చేసింది. 

 

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మోదీ లాక్‌డౌన్ ప్రకటన చేయగానే ప్రభుదేవాతో చేస్తున్న 'రాధే' చిత్ర షూటింగ్‌ను వెంటనే నిలిపివేశాడు సల్మాన్ ఖాన్. తనకు ఇష్టమైన పాన్వెల్ ఫాంహౌస్‌లో తన ఫ్యామిలీతో కలిసి, దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకొనే పనిలో ఉన్నారు. పాన్వెల్ ఫాంహౌస్‌లో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీతో జాక్వలైన్ జత కలిసి అర్పిత పిల్లలతో ఎంజాయ్ చేస్తూ స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తున్నది. మ్యూజిక్ డైరెక్టర్ బాద్షాకు చేసిన వీడియో కాల్‌లో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో ఉన్న విషయాన్ని వెల్లడించింది. ఈ విషయంపై బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. 

 

అంతేకాకుండా సల్మాన్ ఖాన్ తన ఫాంహౌస్‌లో వంట చేయడం, ఆ తర్వాత బొగ్గుతో పెయింటింగ్ వేస్తూ తన ప్రతిభకు పదును పెట్టారు. అలాగే అక్కడే ఉన్న జిమ్‌లో వర్కౌట్ చేస్తూ సమయాన్ని గడుపుతున్నాడు. అంతేకాకుండా ట్రెక్కింగ్, పలు ఎకరాల్లో విస్తరించి ఉన్న భూముల్లో వ్యవసాయ పనులపై దృష్టిపెట్టారు. ఇదిలాఉండగా సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రాధే సినిమాలో నటిస్తున్నారు. పరిస్థితులు అనుకూలించి అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ రంజాన్ సందర్భంగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: