మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడన్న విషయం గురించి కొన్ని రోజుల పాటు సంశయం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సంశయాలన్నీ తొలగిపోయి మహేష్ సినిమా పరశురామ్ దర్శకత్వంలో ఉండనుందని తెలిసింది. కరోనా కారణంగా ఈ సినిమా గురించి అఫీషియల్ ప్రకటించలేదు లేకుంటే ఉగాది రోజు ఈ సినిమా లాంచన కార్యక్రమాలు జరిగి ఉండేవి. పరశురామ్ దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారట.

 

ప్రస్తుతం మహేష్ వంటి స్టార్ హీరోతో నటించే హీరోయిన్లు ఎవరున్నారని దర్శకుడు ఆలోచిస్తున్నాడు. అయితే మహేష్ ఒక సజెషన్ చేశాడట. మహానటి సినిమాతో ఇండియా మొత్తం గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ అయితే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నారట. మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటనకి మహేష్ ఫిదా అయ్యాడట. సావిత్రిగా ఆమె నటించిన విధానం చూసి భవిష్యత్తులో కీర్తితో ఒక సినిమా చేయాలని అనుకున్నాడట.

 

మహర్షి, సరిలేరు టైమ్ లోనే కీర్తిని అడుగుదామని అనుకున్నారట. కానీ ఆ సినిమాల్లో హీరోయిన్ కి అంతగా చెప్పుకోదగ్గ ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు కాబట్టి కీర్తిని అడగలేదట. కానీ ప్రస్తుతం పరశురామ్ తయారు చేసిన స్క్రిప్ట్ లో హీరోయిన్ కి మంచి ఇంపార్టెన్స్ ఉందట. గీత గోవిందం సినిమాలో రష్మిక ఉన్న ఇంపార్టెన్సే ఈ సినిమాలోనూ హీరోయిన్ గా నటించే వారికి ఉంటుందట. అందుకే ఈ సారి మహేష్ సినిమాలో కీర్తిని హీరోయిన్ గా తీసుకోవాలని ఆలోచిస్తున్నారట.

 


మహానటి తర్వాత కీర్తి ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే నటిస్తుంది. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ మహేష్ కి డేట్లు ఇస్తుందో లేదో చూడాలి. అయితే ఒకటి మాత్రం నిజం కీర్తి గనక మహేష్ సినిమాని ఓకే చేస్తే ఆ సినిమాకి మరింత మైలేజి వస్తుంది. మరి కీర్తి సురేష్ ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: